బైరెడ్డి ఎఫెక్ట్: కర్నూలు ఎమ్మెల్సీగా కేఈ ప్రభాకర్ ఏకగ్రీవం
Recommended Video

అమరావతి/కర్నూలు: కర్నూలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా కేఈ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో ఎన్నికల సంఘం అధికారులు కేఈని ఎమ్మెల్సీగా ప్రకటించారు.
నిన్నమొన్నటి వరకు తీవ్ర ఉత్కంఠకు గురిచేసిన ఈ ఎన్నికలు చివరకు ఏకగ్రీవమైంది. కేఈతోపాటు మొత్తం నలుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా, ఓ అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరించుకున్నాడు. బీఎస్పీ అభ్యర్థి నామినేషన్ను అనర్హుడిగా ప్రకటిస్తూ ఎన్నికల సంఘం తిరస్కరించింది.

ఇక ఎంపీటీసీల సంఘం నేత జయప్రకాశ్ రెడ్డి గురువారం డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో మాట్లాడారు. ఆ తర్వాత జయప్రకాశ్ రెడ్డి తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. అంతకుముందు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ కావడం గమనార్హం.
ఈ సమావేశంలో బైరెడ్డిని చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. ఇందుకు బైరెడ్డి కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో బైరెడ్డి అనుచరుడైన జయప్రకాశ్ రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో కేఈ ప్రభాకర్ మాత్రమే నిలిచినట్లయింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications