అదేం కొత్త విషయం కాదు, మన్మోహన్ చెప్పారు: కేవీపీ రామచంద్ర రావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడతానని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రా రావు మంగళవారం నాడు ఢిల్లీలో మీడియాతో చెప్పారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడతానని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రా రావు మంగళవారం నాడు ఢిల్లీలో మీడియాతో చెప్పారు.
ప్రత్యేక హోదాకి, ప్రత్యేక ప్యాకేజీకి ముడిపెట్టడం ఏమాత్రం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాల్లో సగం కూడా ప్యాకేజీతో రావని, ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడతానని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టుకు వంద శాతం నిధులు అనేది కొత్త విషయం కాదని కేవీపీ రామచంద్ర రావు చెప్పారు. అది చట్టంలోనే ఉందన్నారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ దీనిపై ప్రకటన చేశారని చెప్పారు.












Click it and Unblock the Notifications