అర్హులైన హిజ్రాలకు ఫించన్ల పంపిణీ;ఇదే తొలిసారి:మంత్రి పరిటాల సునీత
అనంతపురం:రాష్ట్రంలోనే తొలిసారిగా హిజ్రాలకు మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి పరిటాల సునీత ఫించన్లు పంపిణీ చేశారు.అనంతపురంలోని వెలుగు కార్యాలయంలో బుధవారం అర్హులైన హిజ్రాలకు ఫించన్ల పంపిణీ జరుగగా ఈ కార్యక్రమానికి మంత్రి సునీత ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హిజ్రాలు కూడా సమాజంలో ఒక భాగమేనన్నారు. ఆ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకొని వారిని మనతో సమానంగా ఆదరించాలన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రభుత్వం హిజ్రాలకు పించన్లు పంపిణీకీ శ్రీకారం చుట్టిందన్నారు. నెలకు 1500 రూపాయల చొప్పున అర్హులైన ప్రతి ఒక్కరికి ఫించను అందించడం జరుగుతుందన్నారు. అర్హత నిర్థారణ కోసం హిజ్రాలు మెడికల్ సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి ఫించనుకు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

హిజ్రాల వెతల పై చలించిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి పలు నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రి చెప్పారు.హిజ్రాలు కూడా డ్వాక్రా సంఘాలకు ధీటుగా సంఘాలుగా ఏర్పడి బ్యాంకు లింకేజి ద్వారా రుణాలు పొందాలని ఈ సందర్భంగా మంత్రి పరిటాల సునీత సూచించారు. దేశంలోనే తొలిసారిగా ఎపిలో హిజ్రాలకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు మంజూరు చేయడం జరుగుతోందన్నారు.
-
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు!












Click it and Unblock the Notifications