ప్రభుత్వం ఫెయిలైతే చివరి అస్త్రం: రాష్ట్రపతి పాలనపై చాకో
న్యూఢిల్లీ: రాష్ట్రపతి పాలన చివరి అస్త్రమని ఏఐసిసి అధికార ప్రతినిధి పిసి చాకో గురువారం అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాజా పరిస్థితుల పైన ఆయన స్పందించారు. ఎపిలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉందని చెప్పారు. శాంతిభద్రతలు కాపాడటం దాని బాధ్యత అన్నారు.
శాంతిభద్రతలు కాపాడాలని తాను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కోరినట్లు చెప్పారు. విధి నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమై ఇతరత్రా మార్గాలు లేనప్పుడు మాత్రమే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని పిసి చాకో ఈ సందర్భంగా చెప్పారు.

నిర్ణయం వెనక్కి తీసుకోవాలి: మైసూరా రెడ్డి
కాంగ్రెసు పార్టీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముఖ్య నేత మైసూరా రెడ్డి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. విభజన నిర్ణయాన్ని కాంగ్రెసు పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.
కేంద్రం పునరాలోచించాలని, కేబినెట్ ప్రకటనను వెనక్కి తీసుకోవాలన్నారు. మంత్రుల బృందంలో కేబినెట్ ప్రకటనను పూర్తి చేసే వాళ్లే ఉన్నారని చెప్పారు. విభజనకు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications