ప్రభుత్వం ఫెయిలైతే చివరి అస్త్రం: రాష్ట్రపతి పాలనపై చాకో
న్యూఢిల్లీ: రాష్ట్రపతి పాలన చివరి అస్త్రమని ఏఐసిసి అధికార ప్రతినిధి పిసి చాకో గురువారం అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాజా పరిస్థితుల పైన ఆయన స్పందించారు. ఎపిలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉందని చెప్పారు. శాంతిభద్రతలు కాపాడటం దాని బాధ్యత అన్నారు.
శాంతిభద్రతలు కాపాడాలని తాను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కోరినట్లు చెప్పారు. విధి నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమై ఇతరత్రా మార్గాలు లేనప్పుడు మాత్రమే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని పిసి చాకో ఈ సందర్భంగా చెప్పారు.

నిర్ణయం వెనక్కి తీసుకోవాలి: మైసూరా రెడ్డి
కాంగ్రెసు పార్టీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముఖ్య నేత మైసూరా రెడ్డి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. విభజన నిర్ణయాన్ని కాంగ్రెసు పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.
కేంద్రం పునరాలోచించాలని, కేబినెట్ ప్రకటనను వెనక్కి తీసుకోవాలన్నారు. మంత్రుల బృందంలో కేబినెట్ ప్రకటనను పూర్తి చేసే వాళ్లే ఉన్నారని చెప్పారు. విభజనకు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications