హోదా, జోన్ కోసం ఏ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ రామ్మోహన్నాయుడు
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ సాధించే వరకూ తమ పోరాటం ఆగదని శ్రీకాకుళం ఎంపీ, టీడీపీ నేత కింజారపు రామ్మోహన్నాయుడు స్పష్టం చేశారు. రైల్వే జోన్ కోసం సోమవారం రాత్రి నుంచి దీక్ష చేపట్టిన రామ్మోహన్నాయుడు.. మంగళవారం ఉదయం విరమించారు.
శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం-2లో రైల్వే జోన్ సాధన దీక్ష పేరుతో నిరసన తెలిపారు. కాగా, ఎంపీ దీక్షకు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, జడ్పీ ఛైర్మన్ చౌదరి ధనలక్ష్మి, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవితోపాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు.

ఎంపీ రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ.. తెలుగువారిని అవమానించిన ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉండలేవన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రజల సహనాన్ని పరీక్షించివద్దని హెచ్చరించారు.
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్నారు. హోదా సాధన కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని అన్నారు. శ్రీకాకుళం పోరాటాల పురిటిడ్డ, తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications