టిటిడి చైర్మన్ పదవి కోసం రాయపాటి, ఇక మీకివ్వనని మురళీ మోహన్కు బాబు ఝలక్
తిరుమల తిరుపతి దేవస్థానం రేసులో ఉన్న ఎంపీలు మురళీ మోహన్, రాయపాటి సాంబశివ రావులు శనివారం వేర్వేరుగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు.
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం రేసులో ఉన్న ఎంపీలు మురళీ మోహన్, రాయపాటి సాంబశివ రావులు శనివారం వేర్వేరుగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు.
టిటిడి చైర్మన్ రేసులో ఇరువురు ఉండటం, వారిద్దరు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రేసులో మురళీ మోహన్, రాయపాటి సాంబశివ రావులతో పాటు గాలి ముద్దుకృష్ణమ నాయుడు, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.

చంద్రబాబుతో భేటీ అనంతరం మురళీ మోహన్ మాట్లాడారు. ఈ నెల 26వ తేదీ నుంచి జరిగే తానా సభల్లో పాల్గొనేందుకు అనుమతి కోరేందుకు తాను సీఎం చంద్రబాబును కలిశానని చెప్పారు. టిటిడి చైర్మన్ పదవి గురించి మాట్లాడుతూ.. అది తన చిన్న నాటి కల అన్నారు.
కాగా, తనకు టిటిడి పదవి కావాలన్న మురళీ మోహన్కు చంద్రబాబు ఘాటైన సమాధానం చెప్పారని తెలుస్తోంది. అడిగిన వారందరికీ పదవులు ఇస్తే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని, ఇకపై ఎమ్మెల్యేలు, ఎంపీలకు పదవులు ఇవ్వదలుచుకోలేదని చెప్పారని తెలుస్తోంది.
చంద్రబాబు అమెరికా పర్యటన విజయవంతమైన నేపథ్యంలో కలిసేందుకు వచ్చానని రాయపాటి అన్నారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిషలు కష్టపడుతుంటే జగన్ అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. అయితే, ఇరువురు నేతలు కూడా టిటిడి చైర్మన్ పదవి తమకు ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లుగా తెలుస్తోంది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications