ఎర్రచందనం స్మగ్లర్ పట్టివేత: రియల్టర్ దారుణ హత్య
చిత్తూరు/ రాజమండ్రి: పేరుమోసిన ఎర్రచందనం స్మగ్లర్ అల్తాఫ్ హుస్సేన్ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లాలోని మదనపల్లెకు చెందిన అల్తాఫ్ హుస్సేన్ ఎర్రచందనం బడా స్మగ్లర్లయిన శేఖర్, షరీఫ్లకు అనుచరుడు.
అతన్ని అరెస్టు చేసిననంతరం కర్ణాటక రాష్ట్రం దొడ్డబళ్లాపూర్లో ఫాంహౌస్లో దాచిన రూ.కోటి విలువైన 3 టన్నుల ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈయన ఎక్కడెక్కడ ఎర్రచందనాన్ని దాచిపెట్టారన్న వివరాలను పోలీసులు రాబడుతున్నారు.
అల్తాఫ్ గత ఏడాది కాలంగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నాడు. ఈ స్థితిలో అతన్ని పట్టుకునేందుకు టాస్క్ఫోర్స్ పోలీసులు వేట ప్రారంభించారు. ఈ క్రమంలోనే అతను పోలీసులకు చిక్కాడు.

ఇదిలావుంటే, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగరం నాగదేవి థియేటర్ సమీపంలో ఓ రియల్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తిని కోర్లంపేట కాలనీకి చెందిన కటికతల వెంకట శేషు (53)గా గుర్తించారు. శేషును గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు.
వ్యాపార లావాదేవీల్లో జరిగిన గొడవల కారణంగానే శేషు హత్యకు గురి కావచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆధారాలు సేకరించారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా!












Click it and Unblock the Notifications