అనారోగ్యంతో ఉన్న రోజాను అరెస్టు చేస్తారా, కరణంతో లింకేమిటి: జగన్
హైదరాబాద్: తమ పార్టీ శాసనసభ్యురాలు రోజా గత 9 రోజులుగా అనారోగ్యంతో అస్పత్రిలో ఉన్నారని, ఇప్పుడు కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి బాగా లేదని, అలాంటి మనిషిని అరెస్టు చేశ్తారా అని ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం సభ వాయిదా పడి తిరిగి సమావేశమైన తర్వాత ఆయన మాట్లాడురు.
గతంలో ఎన్నడూ ఈ విధంగా జరగలేదని, రోజాపై సస్పెన్షన్ ఎత్తేయాలని, ఇది తప్పుడు సంప్రదాయమని ఆయన అన్నారు. కరణం బలరాం వ్యవహారానికి, రోజా సస్పెన్షన్కు సంబంధం ఏమిటని ఆయన అడిగారు. బలరాం విషయంలో నిబంధలన్నీ పాటించారని, కరణం బలరాం అప్పట్లో నేరుగా స్పీకర్ను దూషించారని ఆయన గుర్తు చేశారు.

పైగా కరణం బలరాం ఉదంతాన్ని సభా హక్కుల కమిటీకి సిఫార్సు చేశారని, ఈ సందర్భంగా జరిపిన విచారణకు కరణం బలరాం హాజరు కాలేదని, ఆ తర్వాత మాత్రమే కరణం బలరాంను సస్పెండ్ చేశారని ఆయన అన్నారు.
ఇప్పుడు కూడా తమ పార్టీ ఎమ్మెల్యే ఒకరు వస్తుంటే పది మంది టిడిపి ఎమ్మెల్యేలు తిట్టారని ఆయన చెప్పారు. స్పీకర్ సమక్షంలో సభలోనే తిట్టినా పట్టించుకోరా అని ఆయన అడిగారు. సెక్స్ రాకెట్ అంశంపై చర్చ జరగకుండా ఈ అంశం తెర మీదికి వచ్చే విధంగా కుయుక్తి పన్నారని ఆయన అన్నారు. దీంతో సభ 15 నిమిషాల పాటు వాయిదా పడింది.
తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో స్పీకర్ కోడెల శివప్రసాద రావు సభను సోమవారానికి వాయిదా వేశారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications