ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అదృశ్యం: బంగాళాఖాతంలో శకలాలు అవేనా?
చెన్నై/విశాఖ: బంగాళాఖాతంలో అదృశ్యమైన భారత్ ఎయిర్ ఫోర్స్ విమానం ఏఎన్ 32 ఆచూకీ కోసం బలగాలు గాలిస్తున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ వెల్లడించారు. ఏఎన్ 32 విమానం సముద్రంలో కూలి ఉంటుందని భావిస్తున్న సమయంలో, తాజాగా కొన్ని శకలాలు బంగాళాఖాతంలో కనిపించాయని ఆయన వెల్లడించారు.
అయితే, ఏఎన్ 32 విమానానివో కాదోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. విమానం ఆచూకీ గురించి భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని చెప్పారు. దాని గురించి కచ్చితమైన నివేదికలు లేవని చెప్పారు.

కాగా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఏఎన్ 32 వారం రోజుల క్రితం గల్లంతయిన విషయం తెలిసిందే. విమానంలో 29 మంది సిబ్బంది ఉన్నారు.
చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళ్తుండగా హఠాత్తుగా శుక్రవారం ఉదయం ఏటీసీతో ఆ విమానానికి సంబంధాలు తెగిపోయాయి. విమానం కోసే నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విమానం చెన్నైలోని తంబరం నుంచి ఉదయం 8.30 గంటలకు గాల్లోకి ఎగిరింది. ఆ తర్వాత పదహారు నిమిషాలకు సంబంధాలు తెగిపోయాయి.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications