కిడ్నాప్ కథ సుఖాంతం : క్షేమంగా విడుదలైన వైజాగ్ ఇంజనీర్
విశాఖపట్నం : నైజీరియాలో విశాఖ ఇంజనీర్ కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమైంది. 17 రోజుల క్రితం కిడ్నాప్ అయిన ఇంజనీర్ సాయి శ్రీనివాస్ కోసం అతడి కుటుంబ సభ్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోగా.. తాజాగా కిడ్నాపర్ల చెర నుంచి సాయి శ్రీనివాస్ క్షేమంగా బయటపడినట్టు సమాచారం.
17 రోజుల నిర్బంధం తర్వాత సాయి శ్రీనివాస్ ను అక్కడి కిడ్నాపర్లు వదిలిపెట్టారు. దీంతో కిడ్నాపర్ల నుంచి బయటపడిన వెంటనే కుటుంబ సభ్యులకు తన క్షేమ సమాచారాన్ని చేరవేశాడు సాయి శ్రీనివాస్. సాయి శ్రీనివాస్ ఫోన్ తో అతని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలా ఉంటే, నైజీరియాలో పనిచేస్తోన్న సాయి శ్రీనివాస్ ను అక్కడి నైజీరియన్లు గత నెలాఖరున కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. సాయి శ్రీనివాస్ కిడ్నాప్ తో తీవ్ర ఆందోళనకు గురైన అతని కుటుంబ సభ్యులు విషయాన్ని ఏపీ సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో కిడ్నాప్ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లగా.. విదేశాంగ శాఖ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇంతలో కిడ్నాపర్లే సాయి శ్రీనివాస్ ను వదిలేయడంతో కుటుంబ సభ్యుల ఆందోళనకు తెరపడింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications