అలనాటి తార జమున రాజకీయాలకు ఎందుకు దూరమయ్యారు?
భీమవరం: ఒకప్పుడు అలనాటి తార, రాజమండ్రి మాజీ పార్లమెంటు సభ్యురాలు జమున రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇటీవలి కాలంలో ఆమె వాటికి దూరమయ్యారు. అలా ఎందుకయ్యారనడానికి ఆమె కారణాలు చెప్పారు. నేటి రాజకీయాలు సచ్ఛీలత, విలువలకు దూరమయ్యాయని, డబ్బుతో ముడిపడి వున్నాయని, అందువల్లనే వాటిలో ఇమ డలేక తాను దూరంగా ఉన్నానని చెప్పారు.
భీమవరం మావుళ్లమ్మ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి హాజరైన జమున ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఒకప్పుడు రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయడమనే భావం ఉండేదని, ఇప్పుడు మాత్రం రూ.లక్షలు ఖర్చుపెట్టి రూ.కోట్లు సంపా దించు అనే రీతిలో మారిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

1989లో రాజమండ్రి ఎంపీగా తాను గెలుపొందానని, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కేవలం డబ్బు లేకపోవడం వల్లనే ఓడిపోయాననే విషయాన్ని ఇప్పటికీ మర్చిపోలేదనన్నారు. డబ్బు చుట్టూ తిరిగే రాజకీయాల వల్లనే తాను వాటికి దూరంగా ఉంటూ కళాకారుల సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని చెప్పా రు.
దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ప్రోదల్బంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. అప్పట్లో కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు, కొణిజేటి రోశయ్య వంటి నాయకులు తనను ఎంతగానో ప్రోత్సహించారని చెప్పారు. అనంతరం మహిళా కాంగ్రెస్లో పనిచేసినా నేటీ రాజకీయాల్లో ఇమడలేక బయటకు వచ్చినట్టు జమున స్పష్టం చేశారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications