550కోట్లు చెల్లించాలి! అనిల్ అంబానీని దేశం విడిచివెళ్లనీయొద్దు: సుప్రీంలో ఎరిక్సన్ పిటిషన్
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్ ఛైర్మన్ అనిల్ అంబానీని కష్టాలు వీడటం లేదు. తాజాగా అనిల్ అంబానీతో పాటు రిలయన్స్ గ్రూప్నకు చెందిన మరో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్లు దేశం వదలివెళ్లకుండా చూడాలని స్వీడన్ టెలికాం కంపెనీ ఎరిక్సన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అంతక్రితం హామీ ఇచ్చిన విధంగా రూ.550 కోట్లను చెల్లించకుండా వారు ఎగవేస్తారేమోనని సదరు కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది.

రూ. 550కోట్లు చెల్లించాలి కానీ..
కాగా, అంతకుముందు కోర్టు ఆధ్వర్యంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. అంబానీ గ్రూప్ చెల్లించాల్సిన రూ.1600 కోట్ల బకాయిలను రూ.550 కోట్లకు తగ్గించుకుంది. అదే సమయంలో ఈ ఏడాది సెప్టెంబరు 30 కల్లా చెల్లించేలా హామీ తీసుకుంది. అయితే ఆర్కామ్ నుంచి ఎటువంటి చెల్లింపులు రాకపోవడంతో మరోసారి సుప్రీం కోర్టు గడప తొక్కాలని ఎరిక్సన్ నిర్ణయం తీసుకుంది.

అనిల్ అంబానీని దేశం వదిలివెళ్లకుండా..
‘చట్ట ప్రక్రియలను వారు ఉల్లంఘిస్తున్నారు. దేశ చట్టాలకు వారు ఎటువంటి గౌరవం ఇవ్వడం లేదు. అందుకే కోర్టు ధిక్కరణ కింద ఆ కంపెనీ, కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, దేశం వదిలి వెళ్లకుండా చూడాలని కోరుతున్నాం' అని కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్లో ఎరిక్సన్ పేర్కొంది.

60రోజుల గడువు కోరిన ఆర్కామ్
అయితే, ఎరిక్సన్ బకాయిల విషయంలో మరో 60 రోజుల గడువు కోరుతూ సుప్రీం కోర్టులో సెప్టెంబరు 28న దరఖాస్తు చేసినట్లు కూడా ఆర్కామ్ స్పష్టం చేసింది. దీనిపై గురువారం (అక్టోబరు 4న' విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎరిక్సన్ తాజా పిటిషన్ ‘అసమంజసం' అని తెలిపింది.

మరోవైపు ఆర్ కామ్కు ఊరట
ఇది ఇలావుంటే, టెలికాం ట్రైబ్యునల్ నుంచి ఊరట లభించినట్లు ఆర్కామ్ బుధవారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత స్పెక్ట్రమ్ విక్రయాన్ని పూర్తి చేస్తామని తెలిపింది. వాటి ద్వారా వచ్చిన నిధులను ఎరిక్సన్ ఇండియా, ఆర్ఐటీఎల్ మైనారిటీ వాటాదార్లకు చెల్లింపులు చేస్తామని వివరించింది. ‘స్పెక్ట్రమ్ విక్రయం ద్వారా రూ.975 కోట్లు పొందుతాం. ఇందులో రూ.550 కోట్లను ఎరిక్సన్కు; రూ.230 కోట్లను రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ (ఆర్ఐటీఎల్)కు చెల్లిస్తాం' అని బుధవారం బీఎస్ఈకిచ్చిన సమాచారంలో ఆర్కామ్ వల్లడించింది.
‘టెలికమ్యూనికేషన్ల విభాగం(డాట్) కోరిన బ్యాంకు హామీ రూ.2900 కోట్లపై అక్టోబరు 1, 2018న వెలువరిచిన మధ్యంతర ఉత్తర్వుల్లో టెలికాం వివాదాల పరిష్కారాల అప్పీలేట్ ట్రైబ్యునల్(టీడీశాట్) స్టే ఆర్డరు ఇచ్చింది. దీంతో ఆర్కామ్ కు ఊరట లభించినట్లయింది.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్!












Click it and Unblock the Notifications