వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిడుగుపాటుకు 18 ఏనుగులు మృతి -చరిత్రలో రెండో అతిపెద్ద విషాదం -పోస్ట్‌మార్టంపై ఉత్కంఠ

|
Google Oneindia TeluguNews

రోజువారీ పనుల నిమిత్తం పొద్దున్నే అడవిలోకి వెళ్లిన సమీప గ్రామస్తులు అక్కడి దృశ్యాలను చూసి డంగైపోయారు. వేటగాళ్లబారినపడి చనిపోయిన ఏనుగులను చూడటం వారికి కొత్తకానప్పటికీ, తాజా దృశ్యాలు మాత్రం అందరినీ కకావికలం చేశాయి. ఒకటీ రెండూ కాదు.. ఏకంగా పదుల కొద్దీ ఏనుగులు నిర్జీవంగా పడిపోయాయి. వెంటనే ఫారెస్ట్ అధికారులకు కబురు పెట్టగా, వెటర్నరీ డాక్టర్లతోపాటు యంత్రాంగం మొత్తం అడవికి చేరుకుంది..

భారత్ బయోటెక్ అనూహ్య అడుగు -కొవాగ్జిన్ ఫార్ములా పంచుకోడానికి రెడీ -జగన్ లేఖతో మోదీ సర్కార్ కదలికభారత్ బయోటెక్ అనూహ్య అడుగు -కొవాగ్జిన్ ఫార్ములా పంచుకోడానికి రెడీ -జగన్ లేఖతో మోదీ సర్కార్ కదలిక

పిడుగుపాటు 18 ఏనుగులు

పిడుగుపాటు 18 ఏనుగులు

ఈశాన్య రాష్ట్రం అస్సాంలోని నాగావ్ జిల్లా అటవీ ప్రాంతంలో 18 ఏనుగులు దుర్మణం చెందాయి. ప్రతిపాదిత అభరారణ్యమైన కొండోలి అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం ఈ విషాదం వెలుగులోకి వచ్చింది. ఘటనాస్థలిని పరిశీలించిన పిదప అస్సాం వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ ఎంకే యాదవ మీడియాతో మాట్లాడుతూ.. పిడుగుపాటు వల్లే 18 ఏనుగులూ చనిపోయినట్లు భావిస్తున్నామని చెప్పారు. పిడుగుల వల్ల ఏనుగులు మృతి చెందిన ఘటనలు గతంలో పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకున్నా, ఏ సందర్భంలోనూ ఒకటి రెండు కంటే ఎక్కువ ఏనుగులు ఒకేసారి చనిపోయిన దాఖలాల్లేవు.

సీజేఐ రమణ మరో సంచలనం -కరోనా వేళ ప్రత్యేక యాప్ -త్వరలో సుప్రీంకోర్టు విచారణలు లైవ్‌ స్ట్రీమింగ్సీజేఐ రమణ మరో సంచలనం -కరోనా వేళ ప్రత్యేక యాప్ -త్వరలో సుప్రీంకోర్టు విచారణలు లైవ్‌ స్ట్రీమింగ్

ఇలా జరగడం ఇదే తొలిసారి..

ఇలా జరగడం ఇదే తొలిసారి..


పిడుగుల వల్ల ఒకే సారి 18 ఏనుగులు చనిపోవడం ఆశ్చర్యకరమే అయినా ప్రస్తుతానికి వేరే కారణాలేవీ కనిపించడంలేదని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. 2001లో స్మగ్లర్లు పెట్టిన విషాన్ని తిని 21 ఏనుగులు చనిపోవడం అస్సాం చరిత్రలో అతిపెద్ద విషాదంగా నిలిచిపోయింది. మళ్లీ అంతటి స్థాయిలో ఒకే సారి 18 ఏనుగులు పిడుగుపాటుకు చనిపోవడం కలకలం రేపింది. అయితే, ఏనుగుల మరణాలకు పిడుగులే కారణమని ఫారెస్ట్ అధికారులు భావిస్తుండగా, పోస్ట్ మార్టం రిపోర్టులో ఏం వస్తుందోనని ఉత్కంఠగా మారింది.

Recommended Video

#ElectionResult : Kerala లో చరిత్ర WB అస్సోంలో అధికార పార్టీలే.. Tamil Nadu లో DMK | Oneindia Telugu
కొత్త సీఎం కీలక ఆదేశాలు..

కొత్త సీఎం కీలక ఆదేశాలు..

నాగావ్ జిల్లాల్లో 18 ఏనుగులు చనిపోయిన ఘటనలపై అస్సాం కొత్త ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస శర్మ దిభ్రాంతి వ్యక్తం చేశారు. ఏనుగుల అనుమానాస్పద మరణాలపై దగ్గరుండి పరిశీలన చేయాల్సిందిగా అటవీశాఖ మంత్రి పరిమళ్ శుక్లా బైద్యను సీఎం ఆదేశించారు. దీంతో మంత్రి నేరుగా కొండోలి అటవీ ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

English summary
At least 18 elephants were found dead in a forest in Assam’s Nagaon district on Thursday morning, authorities said. “We suspect that it is a lighting strike that killed them as a result of the storm yesterday,” said M K Yadava, Chief Wildlife Warden, Assam, adding that a team of veterinary doctors as well as forest officials have been rushed to the spot for further investigation. The carcasses were found by locals in the Kundoli Proposed Reserve Forest under the Kathiatoli range in Nagaon district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X