భర్త పనేనా?: మాజీ సీఎం కూతురుపై దుండగుల దాడి
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమార్తె లతిక దీక్షిత్పై కొందరు దుండగులు దాడి చేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమార్తె లతిక దీక్షిత్పై కొందరు దుండగులు దాడి చేశారు. లతిక ఉంటున్న హైలే రోడ్డులోని ఉపాసన అపార్ట్మెంట్స్లోకి ముగ్గురు దుండగులు చొరబడి దాడి చేశారు. ఈ ఘటనపై ఢిల్లీ యూత్ కాంగ్రెస్ సభ్యుడు శశికాంత్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
భర్తతో మనస్పర్థలు కారణంగా లతిక కొంతకాలంగా వేరుగా ఉంటున్నారు. భర్తపై ఆమె గృహహింస చట్టం కింద కేసు పెట్టింది. దీంతో పోలీసులు బెంగళూరులో ఉంటున్న ఇమ్రాన్ని అదుపులోకి తీసుకున్నారు.

లతికపై కోపంతో ఇమ్రాన్ మనుషులే ఈ దాడికి పాల్పడి ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దాడి ఘటనలో మొత్తం ఏడుగురు పాల్గొన్నట్లు తెలిపారు. దాడికి ముందు లతిక ఉంటున్న అపార్ట్మెంట్ వద్ద అనుమానాస్పదంగా దుండగులు తిరుగుతుండటంతో తాము పోలీసులకు సమాచారమిచ్చామని తెలిపారు.
పోలీసులు అక్కడి వచ్చే లోపే దుండగులు పారిపోయారని చెప్పారు. కాగా, నవంబర్ 17న జరిగిన ఈ ఘటనలో పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిందితుల నుంచి ఓ కారు, రెండు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications