రెండాకుల చిహ్నం కోసం పోటీ, నేడు డెడ్ లైన్: ధీమాతో పళని, పన్నీర్ వర్గం, అదే కారణం !
రెండాకుల చిహ్నం కోసం పోటీ, ఢిల్లీలో మకాంపళనిసామి, పన్నీర్ సెల్వం వర్గంలో ధీమా, అదే కారణంఅన్నాడీఎంకే పార్టీ, చిహ్నం మాదే, పండగ చేసుకోవడానికి సిద్దం
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం కోసం ఆ పార్టీలోని రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. సోమవారం అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ కార్యాలయంలో హాజరైనారు. రెండాకుల చిహ్నం మాకే ఇవ్వాలంటే లేదు మాకే ఇవ్వాలని అధికారులకు మనవి చేశారు.
Recommended Video
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గంలోని మంత్రులు ఎంపీ. సంపత్, జయకుమార్, పార్లమెంట్ సభ్యుడు మైత్రేయన్ తదితరులు, టీటీవీ దినకరన్ తరుపన రెబల్ ఎమ్మెల్యే తంగ తమిళ సెల్వన్, పూహళేంది తదితరులు ఎన్నికల కమిషన్ ముందు హాజరైనారు.
రెండాకుల చిహ్నం మాకే వస్తుందని పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. అందుకు కారణం మెజారిటీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మా వైపే ఉన్నారని అంటున్నారు. ఆదివారం కడలూరులో జరిగిన బహిరంగ సభలో హోర్డింగ్ ల మీద రెండాకుల చిహ్నం వెయ్యడం చూస్తుంటే పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గం మరింత ఉత్సాహంగా ఉందని తెలిసింది.
సోమవారం రెండాకుల చిహ్నం ఎవరికో ఒకరికి కేటాయించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఎన్నికల కమిషన్ ముందు రెండు వర్గాలు వాదనలు వినిపిస్తున్నాయి. రెండాకుల చిహ్నం సొంతం అయిన వెంటనే తమిళనాడులోని అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్సి సంబరాలు చేసుకోవడానికి రెండు వర్గాలు సిద్దంగా ఉన్నాయి.