కూలిన మిగ్-21 బైసన్ విమానం: ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్ మృతి
భోపాల్: భారత వాయుసేనకు చెందిన మిగ్-21 బైసన్ విమానం బుధవారం మధ్యాహ్నం కుప్పకూలిపోయింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఈ ప్రమాదం జరిగింది. యుద్ధ విన్యాసాల శిక్షణ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.
వామ్మో.. నడిరోడ్డుపై, కారులో వెళ్తుండగా.. కూలిన విమానం, మంటలు.. ఇద్దరు మహిళలు
ఈ విమాన ప్రమాదంలో భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్ ఏ. గుప్తా మరణించారు. ఈ విషయాన్ని వాయుసేన అధికారులు ధృవీకరించారు. గ్రూప్ కెప్టెన్ ఏ. గుప్తా మరణించడం పట్ల వాయుసేన తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఘటనపై వాయుసేన కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించింది.
కాగా, గత 18 నెలల్లో మిగ్ 21 శ్రేణి విమానాలు ప్రమాదానికి గురికావడం ఇది మూడోసారి కావడం గమనార్హం. 2019 సెప్టెంబర్ నెలలో ఇదే ఎయిర్ బేస్ లో మిగ్ 21 ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదాల కారణంగా విమానానులను నష్టపోవడంతోపాటు అత్యంత విలువైన ఫైటర్ పైలట్లను కూడా భారత్ కోల్పోవడం జరుగుతోంది.