జాగ్రత్త.. భారత్పై భారీ ఉగ్రదాడి జరగబోతోంది: ఆర్మీ చీఫ్ హెచ్చరిక
భారత్పై భారీ ఉగ్రదాడి జరగబోతోందని ఇండియన్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ బుధవారం హెచ్చరించారు. ఉరీ తరహా ఉగ్రదాడి మరోమారు జరగబోతున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చినట్లు చెప్పారు.
న్యూఢిల్లీ : భారత్పై భారీ ఉగ్రదాడి జరగబోతోందని ఇండియన్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ బుధవారం హెచ్చరించారు. దేశంలోని మారుమూల ప్రదేశాల్లో భద్రత లోపించిందని, ఉరీ తరహా ఉగ్రదాడి మరోమారు జరగబోతున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చినట్లు చెప్పారు.
సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేయడం, నిఘా వర్గాలను మరింత బలపరచడంతోపాటు సాధ్యమైనంత త్వరగా భారత ఆర్మీని దుర్భేద్యంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా పశ్చిమ, ఉత్తర సరిహద్దుల్లో నిఘా వ్యవస్థ బలపడాలని రావత్ సూచించారు. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ను వినియోగించే యోచనలో కూడా ఉన్నట్లు చెప్పారు.
గతేడాది ఉరీ ఉగ్రదాడి అనంతరం.. భారత సైన్యం పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అవసరమైతే మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహిస్తామని కూడా రావత్ కొద్దిరోజుల క్రితం చెప్పారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications