విజయ మాల్యాకు ఝలక్: గోవాలోని విల్లా స్వాధీనం
ముంబై: బ్యాంకులకు రూ.9వేల కోట్లకు పైగా ఎగ్గొట్టి లండన్లో ఉంటున్న కింగ్ ఫిషర్ అధినేత విజయ మాల్యాకు తొలి షాక్ తగిలింది. గోవాలోను ఆయన భవంతిని బ్యాంకు అధికారులు శుక్రవారం నాడు స్వాధీనం చేసుకున్నారు.
ఆస్తులు జఫ్తు చేసినా, మాల్యా భారత్ రావాల్సిందే: ఈడీ
గోవాలోని కింగ్ ఫిషర్ విల్లాను బ్యాంకు అధికారులు ఈరోజు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.90 కోట్ల విలువ చేసే ఈ విల్లాను ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ తన అధీనంలోకి తీసుకుంది. ఈ విల్లాను స్వాధీనం చేసుకునేందుకు ఉత్తర గోవా కలెక్టర్ గురువారం బ్యాంకు అధికారులకు అనుమతి మంజూరు చేశారు.
కాగా, విజయ్ మాల్యా గోవాకు వచ్చినప్పుడు ఈ భవంతిలోనే ఉండేవారు. ప్రముఖులకు పార్టీలు కూడా ఇందులో జరుగుతుండేవని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, విజయ్ మాల్యాకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని సీబీఐ గ్లోబల్ పోలీస్ - ఇంటర్ పోల్కు గురువారం లేఖ రాసింది.