వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ-శివసేన కూటమి విజయం, ఒంటరిగా...: సర్వే

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి ఘన విజయం సాధించవచ్చునని సర్వేలో వెల్లడైంది. ఏబీపీ న్యూస్ - ఏసీ నీల్సన్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో 288 అసెంబ్లీ స్థానాల్లో సుమారు 200 సీట్లను కైవసం చేసుకోవచ్చునని అంచనా వేసింది.

దాదాపు పదమూడువేల మంది పైన 72 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ సర్వే చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభావం ఈ ఎన్నికల పైన ఉంటుందని పేర్కొంది. సర్వే వివరాలను శుక్రవారం వెలువరించింది. బీజేపీ సొంతగా 107 సీట్లను పొందవచ్చునని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ బలం 2009లో సాధించిన 82 స్థానాల నుండి 40కి పడిపోవచ్చునని అంచనా వేసింది.

BJP-Sena to sweep Maharashtra, Survey says

శివసేనతో పొత్తు కుదరని పక్షంలోను బీజేపీ సుమారు 103 స్థానాలను గెలుచుకోవచ్చునని పేర్కొంది. శివసేన 64 స్థానాలను గెలుచుకునే అవకాశముంది. బీజేపీ-శివసేన-ఆర్పీఐ-స్వాభిమాని షెట్కారి సంఘటనతో కూడిన మహా కూటమి ఘన విజయం సాధించనుందని సర్వేలో పాల్గొన్న వారిలో 62 శాతం మంది అభిప్రాయపడ్డారు.

English summary
The BJP-Shiv Sena alliance may get a two-thirds majority in Maharashtra and BJP alone may be close to the magic mark in Haryana and the states which go for elections later this year, according to an ABP News-Nielsen opinion poll survey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X