Video : బీహార్లో కుప్పకూలిన రూ.14 కోట్ల వంతెన- ప్రారంభానికి ముందే ఘటన..
బీహార్ లోని బెగూసరాయ్ జిల్లాలో ఇవాళ ఓ భారీ వంతెనలో ఓ భాగం కుప్పకూలింది. రూ.14 కోట్ల రూపాయలతో తాజాగా నిర్మించిన ఈ వంతెన ప్రారంభానికి ముందే కుప్పకూలింది. తాజాగా గుజరాత్ లో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటన నుంచి కోలుకోకముందే బీహార్ లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశమవుతోంది.
బీహార్లోని
బెగూసరాయ్
లో
ఉన్న
సాహెబ్
పూర్
కమాల్
లో
తాజాగా
నిర్మించిన
ఓ
వంతెనలో
మధ్య
భాగం
ఇవాళ
అనూహ్యంగా
కుప్పకూలింది.
బుర్హీ
గండక్
నదిపై
నిర్మించిన
ఈ
వంతెన
మధ్యలో
కొంతభాగం
కుప్పకూలి
నదిలో
పడిపోయింది.
అయితే
ప్రమాద
సమయంలో
ఈ
వంతెనపై
ఎవరూ
లేకపోవడంతో
పెను
ప్రమాదం
తప్పినట్లయింది.
ఈ
వంతెన
నిర్మాణం
పూర్తయినా
ప్రస్తుతం
వాడకంలో
లేదని,
కుప్పకూలడం
వెనుక
కారణాల్ని
తెలుసుకునేందుకు
ప్రయత్నిస్తున్నట్లు
అధికారులు
తెలిపారు.
సాహెబ్ పూర్ కమాల్ వద్ద నిర్మించిన ఈ వంతెన బీహార్లోని అహోక్-బిషన్ పూర్ లను కలిపేలా నిర్మించారు. ఘటనతో ఉలిక్కిపడ్డ అధికార యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించింది. 2016లో నిర్మించిన ఈ వంతెన ప్రారంభం మాత్రం కాలేదు. ఆ లోపే ఇలా కుప్పకూలడంపై దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని వారు చెప్తున్నారు.
#WATCH | Bihar: A portion of a bridge that was built across Burhi Gandak River in Sahebpur Kamal, Begusarai collapsed and fell into the river yesterday. The bridge had developed cracks a few days back. Nobody was on the bridge at the time of the incident. pic.twitter.com/zB7L3bAOPA
— ANI (@ANI) December 19, 2022