Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video : బీహార్లో కుప్పకూలిన రూ.14 కోట్ల వంతెన- ప్రారంభానికి ముందే ఘటన..

బీహార్ లోని బెగూసరాయ్ జిల్లాలో ఇవాళ ఓ భారీ వంతెనలో ఓ భాగం కుప్పకూలింది. రూ.14 కోట్ల రూపాయలతో తాజాగా నిర్మించిన ఈ వంతెన ప్రారంభానికి ముందే కుప్పకూలింది. తాజాగా గుజరాత్ లో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటన నుంచి కోలుకోకముందే బీహార్ లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశమవుతోంది.

బీహార్లోని బెగూసరాయ్ లో ఉన్న సాహెబ్ పూర్ కమాల్ లో తాజాగా నిర్మించిన ఓ వంతెనలో మధ్య భాగం ఇవాళ అనూహ్యంగా కుప్పకూలింది. బుర్హీ గండక్ నదిపై నిర్మించిన ఈ వంతెన మధ్యలో కొంతభాగం కుప్పకూలి నదిలో పడిపోయింది. అయితే ప్రమాద సమయంలో ఈ వంతెనపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
ఈ వంతెన నిర్మాణం పూర్తయినా ప్రస్తుతం వాడకంలో లేదని, కుప్పకూలడం వెనుక కారణాల్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

bridge collapsed in bihar before inaugaration- here are details

సాహెబ్ పూర్ కమాల్ వద్ద నిర్మించిన ఈ వంతెన బీహార్లోని అహోక్-బిషన్ పూర్ లను కలిపేలా నిర్మించారు. ఘటనతో ఉలిక్కిపడ్డ అధికార యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించింది. 2016లో నిర్మించిన ఈ వంతెన ప్రారంభం మాత్రం కాలేదు. ఆ లోపే ఇలా కుప్పకూలడంపై దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని వారు చెప్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+