మోడీపై ఫిర్యాదు: ఢిల్లీ పోలీస్ నెక్ట్స్ స్టెప్ ఏంటీ?
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రతిష్టను దెబ్బతీసేలా మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్లో ట్వీట్స్ చేసిన ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీపై రాష్ట్రపతి భవన్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రణబ్ ముఖర్జీ, ఆయన కార్యదర్శి ఒమితా పౌల్ తరఫున అధికారులు ఢిల్లీ పోలీసు కమీషనర్ బీఎస్ బస్సీకి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.
లలిత్ మోడీ ఇటీవల ట్విట్టర్లో ప్రణబ్ ముఖర్జీ, ఆయన కార్యదర్శి ఒమితా పౌల్పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. లలిత్ మోడీ జూన్ 23న ట్విట్టర్పై చేసిన విమర్శలకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఫిర్యాదు పత్రంతో పొందుపరిచారు. లలిత్ మోడీ ట్వీట్లో ప్రణబ్ ముఖర్జీ, అమితాపౌల్, ప్రముఖ వ్యాపారవేత్త వివేక్ నాగ్పాల్ ఫోటో పెట్టి ముఖర్జీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వివేక్ నాగ్పాల్ ఆయన నుంచి లబ్ధి పొందారని ఆరోపించారు.
గతంలో కోచ్చి ఐపిఎల్ ప్రాంచైజీలో వాటాల పెట్టుబడుల గురించి ప్రశ్నించినందుకు ప్రణబ్ ముఖర్జీ తనపైకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి)ని విచారణకు ఆదేశించారని మరో ఆరోపణ చేశారు. ఐపీఎల్లో కొచ్చి వాటాల గురించి తాను ప్రశ్నలు అడిగినందుకే శశిథరూర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చిందని ట్వీట్లో పేర్కొన్నారు.

ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీపై రాష్ట్రపతి భవన్ చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు సాధ్యమవుతుందా లేదా అనేది ఢిల్లీ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చా లేదా అనే అంశంపై ఢిల్లీ పోలీసులు న్యాయ శాఖ సలహా తీసుకుంటున్నారు.
కేంద్ర న్యాయ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తక్షణమే రాష్టప్రతి భవన్ ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించి ప్రస్తుతం లండన్లో తలదాచుకుంటున్న లలిత్ మోడీకి నోటీసులు పంపిస్తారు. రాష్టప్రతి భవన్ ఫిర్యాదును ఐపీసీ 499 లేదా 500 సెక్షన్ల కింద నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది.
రాష్టప్రతిని అప్రతిష్ట పాలు చేసేలా వ్యాఖ్యలు చేసినందుకు గాను లలిత్ మోడీకి రెండు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీనితోపాటు ఆయన ట్విట్టర్ ఖాతాను నిలుపుదల చేసేందుకు కూడా అవకాశాలున్నాయి.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications