జియోకు షాక్: రూ.20 నెలకు డేటా సేవలు ప్రారంభించనున్న డేటావిండ్
రియలన్స్ జియో ఇతర టెలికం కంపెనీలకు ఏ రకంగా షాక్ ఇచ్చిందో, జియోకు డేటా విండ్ కూడ షాక్ ఇచ్చేందుకు సిద్దమైంది. నెలకు రూ.20 చెల్లిస్తే డేటా సేవలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
న్యూఢిల్లీ:రియలన్స్ జియో ఇతర టెలికం కంపెనీలకు ఏ రకంగా షాక్ ఇచ్చిందో, జియోకు డేటా విండ్ కూడ షాక్ ఇచ్చేందుకు సిద్దమైంది. నెలకు రూ.20 చెల్లిస్తే డేటా సేవలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
రిలయన్స్ జియో మార్కెట్లోకి రావడమే ఓ సంచలనం.జియో మార్కెట్లోకి రావడం వల్లే ఇతర టెలికం కంపెనీలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
ఆరుమసాల పాటు ఉచిత సేవలను ఇచ్చిన రిలయన్స్ జియో , ఏప్రిల్ నుండి తమ చందాదారుల నుండి డబ్బులు వసూలు చేయనుంది.
అయితే ఈ మేరకు రిలయన్స్ జియో తమ టారిఫ్ ప్లాన్లను ప్రకటించింది.అయితే జియోకు ధీటుగానే ఇతర టెలికం కంపెనీలు కూడ తమ టారిఫ్ల్ ప్లాన్లలో మార్పులు చేర్పులు చేశాయి.

జియోకు డేటావిండ్ షాక్
ఇతర టెలికం కంపెనీలకు రిలయన్స్ జియో షాకిస్తే , డేటా విండ్ కంపెనీ రిలయన్స్ జియోకు షాకిచ్చింది. అతి తక్కువ ధరకే డేటా సేవలను అందించాలని నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయంతో రిలయన్స్ జియోకు షాకిచ్చింది.భారత టెలికం వ్యాపారంలోకి వందకోట్ల పెట్టుబడులతో డేటావిండ్ ప్రవేశిస్తోంది.

రూ.20 డేటా ప్లాన్ ను ఇవ్వనున్న డేటా విండ్
నెలకు రూ.20 లేదా అంతకంటే తక్కువ డేటా ప్లాన్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు డేటావిండ్ ప్రకటించింది. మరో నెలరోజుల్లో డేటావిండ్ తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. డేటా సేవలపైనే కేంద్రీకరించనున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది.

టారిఫ్ ప్లాన్లను సమీక్షిస్తున్న టెలికం కంపెనీలు
రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో ఇప్పటికే టెలికం కంపెనీలు తమ టారిఫ్ ప్లాన్లను సమీక్షించాయి.ఏప్రిల్ 1 నుండి ఒకవైపు జియో టారిఫ్ ప్లాన్స్ లోకి ఎంట్రీ ఇస్తోంది. మరో వైపు అనేక స్వదేశీ, విదేశీ టెలికం ఆపరేటర్లు తమ ప్లాన్లు సమీక్షించుకొంటున్నాయి.దేశీయ టెలికం బిజినెస్ పై కెనడియన్ మొబైల్ తయారీ సంస్థ డేటా విండ్ కన్నేసింది. టెలికం స్పేస్ లో మరోక గేమ్ ఛేంజర్ గా నిలవనుంది.

ఏడాదికి రూ.200 డేటా సేవలు అందించనున్న డేటా విండ్
3జీ, 4 జీ సేవలను అందించే దిశగా వ్యాపారాన్ని మరో నెల రోజుల్లో డేటా విండ్ ప్రారంభించనుంది. ఖాతాదారులకు ఏడాదికి రూ.200 చెల్లిస్తే డేటా సేవలను అందించాలని ఆ కంపెనీ ప్లాన్ చేస్తోంది.బడ్జెట్ ఫోన్లు, తక్కువ ధరలకే ల్యాప్ టాప్ లను అందిస్తోంది డేటా విండ్. దేశ వ్యాప్తంగా వర్చ్యువల్ నెట్ వర్క్ ఆపరేటింగ్ కోసం ధరఖాస్దు చేసింది డేటావిండ్.దీనికి అనుమతి లభిస్తే మొదటి ఆరుమాసాల పాటు ఏడాదికి రూ.200 డేటా సర్వీసులను అందించనుంది.

చౌక ప్లాన్లపై డేటావిండ్ ప్లాన్
రిలయన్స్ జియో రూ.300 ప్లాన్ నెలకు వెయ్యి నుండి 1500 రూపాయాలను ఖర్చు చేసేవారు మాత్రమే భరించనున్నారు.అయితే 300 మిలియన్ ప్రజలే ఈ టారిఫ్ ను ఆమోదించే అవకాశాలున్నాయని డేటావిండ్ కంపెనీ సిఈఓ సింగ్ తులి అభిప్రాయపడ్డారు. నెలకు రూ.90 కంటే తక్కువ ఖర్చు కోసం దృష్టిపెట్టినట్టు వెల్లడించారు. నెలకు రూ.20 కంటే తక్కువ డబ్బులను నిర్ణయించే అవకాశం ఉందని డేటావిండ్ కంపెనీ వర్గాలు చెప్పాయి.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications