9మంది పోలీసులకు మరణశిక్ష..! కోర్టు సంచలన తీర్పు..!
తమిళనాడు (Tamil Nadu)లో ఆరేళ్ల క్రితం జరిగిన ఓ అరుదైన కస్టడీ హత్యల కేసులో మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఇవాళ (madurai court)సంచలన తీర్పు ఇచ్చింది. తండ్రీ కొడుకుల్ని కస్టడీలో హించించి చంపేసిన కేసుపై దర్యాప్తు జరిపిన మధురై కోర్టు.. ఇవాళ 9 మంది పోలీసు అధికారులకు మరణశిక్షలు విధిస్తూ అరుదైన తీర్పును వెలువరించింది. ఈ కేసును అత్యంత క్రూరమైన, అధికార దుర్వినియోగానికి పరాకాష్ట, అరుదైన నేరాల్లోకెల్లా అరుదైనదిగా కోర్టు అభివర్ణించింది.
కరోనా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి తమ మొబైల్ యాక్సెసరీస్ దుకాణాన్ని తెరిచి ఉంచారనే ఆరోపణలపై జయరాజ్ , అతని కుమారుడు బెన్నిక్స్లను 2020 జూన్ 19న పోలీసులు అరెస్టు చేశారు. సాతన్కుళం పోలీస్ స్టేషన్ లోపల వారిని నిరంతరంగా హింసించారని, ఈ క్రమంలో బలమైన దెబ్బలు, తీవ్ర రక్తస్రావంతో సహా అనేక తీవ్రమైన గాయాలపాలయ్యారని దర్యాప్తు అధికారులు తర్వాత నిర్ధారించారు. ఆరేళ్ల పాటు సాగిన విచారణ అనంతరం తీర్పు వెలువరిస్తూ, మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి జి.ముత్తుకుమారన్, వ్యాపారి పి.జయరాజ్ (59), అతని కుమారుడు జె.బెన్నిక్స్ (31) మరణాల కేసులో నిందితులైన తొమ్మిది మందిని హత్య, సంబంధిత నేరాలపై (Sathankulam Custodial Murders) దోషులుగా నిర్ధారించారు.

కస్టడీలో చిత్రహింసలు ముందుగా ప్లాన్ చేసుకుని, రాత్రంతా కొనసాగించారన్న సీబీఐ వాదనను కోర్టు ఆమోదించింది. అందువల్ల వీరికి గరిష్ట శిక్ష విధించడం సముచితమని పేర్కొంది. శిక్షపడిన వారిలో ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీధర్, సబ్-ఇన్స్పెక్టర్లు పి రఘు గణేష్, కె బాలకృష్ణన్, హెడ్ కానిస్టేబుళ్లు ఎస్ మురుగన్, ఎ సమదురై, కానిస్టేబుళ్లు ఎం ముత్తురాజ్, ఎస్ చెల్లదురై, ఎక్స్ థామస్ ఫ్రాన్సిస్, ఎస్ వేలుముత్తు ఉన్నారు. పదవ నిందితుడైన స్పెషల్ సబ్-ఇన్స్పెక్టర్ పాల్దురై విచారణ సమయంలో కరోనాతో చనిపోయారు.












Click it and Unblock the Notifications