బ్యాగులో 9 ఏళ్ళ బాలిక మృతదేహం, ఎవరామె?
న్యూఢిల్లీ: హర్యానాలోని రోహ్తక్లో తొమ్మిదేళ్ళ బాలిక మృతదేహం ఓ బ్యాగులో లభ్యమైంది. బాలికను హతమార్చిన గుర్తు తెలియని దుండగులు ఎవరికీ అనుమానం రాకుండా బ్యాగులో కుక్కి ఓ కాలువలో పడేశారు. మృతి చెందిన బాలిక ఎవరనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
హర్యానాలోని రోహ్తక్లో తొమ్మిదేళ్ళ బాలిక మృతదేహం బ్యాగులో పెట్టి కాలువలో పడేయడం కలకలం రేపుతోంది. రోహ్తక్లోని సర్ధార్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు ఆదివారం నాడు పోలీసులు కేసు నమోదు చేశారు.

టిటోలి గ్రామానికి నీటి సరఫరా కోసం రామ్ భగత్ అనే వ్యక్తి కెనాల్ వద్దకు వెళ్ళాడు. అయితే కాలువ పక్కనే ఓ బ్యాగులో తొమ్మిదేళ్ళ చిన్నారి బాలిక మృతదేహన్ని కనుగొన్నాడు. ఈ విషయాన్ని ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
ఈ విషయం తెలిసిన వెంటనే సర్దార్ పోలీస్ స్టేషన్ పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకొన్నారు. ఆ పాప మృతదేహన్ని స్వాధీనం చేసుకొన్నారు. అయితే ఆ బాలిక ఎవరనే విషయాన్ని ఇంకా గుర్తించలేదు. అయితే చనిపోయిన బాలికను గుర్తించాలని పోలీసులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
మృతదేహం బాగా కుళ్ళిపోయిన స్థితిలో ఉంది. మృతురాలి కుడిచేయిని చేపలు తిని ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. వారం రోజుల క్రితమే ఆ బాలిక మరణించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications