పరువు నష్టం దావా: కెప్టెన్ విజయ్కాంత్కు ఊరట
చెన్నై: పరువు నష్టం దావాలో ఎండిఎంకె నేత, సినీ నటుడు విజయ్కాంత్కు ఊరట లభించింది. వ్యక్తిగత హాజరు నుంచి ఆయనకు హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. తమిళనాడు ప్రభుత్వం నమక్కల్ కోర్టులో ఆయనపై పరువు నష్టం దావా వేసింది.
ఇది వరకు కూడా అటువంటి మినహాయింపులు ఇచ్చిన సందర్భాలు ఉండడంతో జస్టిస్ ఆర్ సుధాకర్, కెకె సుదర్శన్లతో కూడిన మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ విజయ్కాంత్ పిటిషన్ను అనుమతిస్తూ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది.

తదుపరి ఆదేశాలు అందే వరకు పిటిషనర్కు ఇచ్చిన మినహాయింపు అమలులో ఉంటుందని కోర్టు తెలియజేస్తూ ఈ రిట్ పిటిషన్తో పాటు మరో రెండు పిటిషన్లను వేసవి సెలవుల తర్వాత చేపట్టనున్నట్లు తెలిపింది.
ముఖ్యమంత్రి జయలలితపై పెండింగులో ఉన్న కేసులపై విజయ్కాంత్ 2012 ఆగస్టు 17వ తేదీన ఓ బహిరంగ సభలో విమర్శలు చేశారు. దానిపై సిటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నమక్కల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ దావాలో జూన్ 3వ తేదీన హాజరు కావాలని నమక్కల్ కోర్టు విజయ్కాంత్కు ఆదేశాలు జారీ చేసింది.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్












Click it and Unblock the Notifications