చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరువు నష్టం దావా: కెప్టెన్ విజయ్‌కాంత్‌కు ఊరట

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: పరువు నష్టం దావాలో ఎండిఎంకె నేత, సినీ నటుడు విజయ్‌కాంత్‌కు ఊరట లభించింది. వ్యక్తిగత హాజరు నుంచి ఆయనకు హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. తమిళనాడు ప్రభుత్వం నమక్కల్ కోర్టులో ఆయనపై పరువు నష్టం దావా వేసింది.

ఇది వరకు కూడా అటువంటి మినహాయింపులు ఇచ్చిన సందర్భాలు ఉండడంతో జస్టిస్ ఆర్ సుధాకర్, కెకె సుదర్శన్‌లతో కూడిన మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ విజయ్‌కాంత్ పిటిషన్‌ను అనుమతిస్తూ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది.

Defamation case: Vijaykanth exempted from personal appearance

తదుపరి ఆదేశాలు అందే వరకు పిటిషనర్‌కు ఇచ్చిన మినహాయింపు అమలులో ఉంటుందని కోర్టు తెలియజేస్తూ ఈ రిట్ పిటిషన్‌తో పాటు మరో రెండు పిటిషన్లను వేసవి సెలవుల తర్వాత చేపట్టనున్నట్లు తెలిపింది.

ముఖ్యమంత్రి జయలలితపై పెండింగులో ఉన్న కేసులపై విజయ్‌కాంత్ 2012 ఆగస్టు 17వ తేదీన ఓ బహిరంగ సభలో విమర్శలు చేశారు. దానిపై సిటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నమక్కల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ దావాలో జూన్ 3వ తేదీన హాజరు కావాలని నమక్కల్ కోర్టు విజయ్‌కాంత్‌కు ఆదేశాలు జారీ చేసింది.

English summary
Madras High Court today dispensed with the personal appearance of actor-turned politician Vijaykanth of DMDK in a defamation case filed against him by the Tamil Nadu Government in a court in Namakkal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X