డిగ్గీ రాజ‘దిగ్విజయ్ సింగ్’అల్లుడి చీటింగ్ కేసు: రూ.1.15 కోట్ల చెక్ లు బౌన్స్, చంద్రబాబు కేసు !
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ అల్లుడి మీద బెంగళూరు నగరంలో కేసు నమోదు అయ్యింది.
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ అల్లుడి మీద బెంగళూరు నగరంలో కేసు నమోదు అయ్యింది. ప్రభుత్వ కాంట్రాక్టు ఇప్పిస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అల్లుడు భవానీ సింగ్ మోసం చేశారని కేసు నమోదు అయ్యింది.
కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ గా దిగ్విజయ్ సింగ్ గతంలో పని చేశారు. ఆ సందర్బంలో బెంగళూరుకు చెందిన బాలాజీ ఎలక్ట్రికల్స్ సంస్థ యజమాని చంద్రబాబుతో దిగ్విజయ్ సింగ్ అల్లుడు భవానీ సింగ్ భేటీ అయ్యారని సమాచారం.

ఆ సందర్బంలో కర్ణాటక ప్రభుత్వంలో మీకు కాంట్రాక్టు ఇప్పిస్తానని నమ్మించిన భవానీ సింగ్ తన దగ్గర రూ. 1.15 కోట్లు తీసుకున్నారని బాలాజీ ఎలక్ట్రికల్స్ యజమాని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. దిగ్విజయ్ సింగ్ తరువాత కర్ణాటక శాఖ బాధ్యతల నుంచి తప్పుకున్నారని చంద్రబాబు గుర్తు చేశారు.
తాను ఇచ్చిన నగదు తిరిగి చెల్లించాలని దిగ్విజయ్ సింగ్ అల్లుడు భవానీ సింగ్ కు మనవి చేశానని, ఆయన రూ. 25, రూ. 35, రూ. 55 లక్షలకు చెక్ లు ఇచ్చారని, మూడు చెక్ లు బౌన్స్ అయ్యాయని చంద్రబాబు బెంగళూరులోని 22వ ఏసీఎంఎం న్యాయస్థానంలో కేసు దాఖలు చేశారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications