జైలు నుంచి గాలి జనార్ధన్ విడుదల: చిదంబరం కుమారుడికి నోటీసులు
బెంగళూరు/చెన్నై: ఓఎంసి కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్ధన్ రెడ్డి బెంగళూరు పరప్పన అగ్రహారం జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యారు. సుమారు నాలుగేళ్లపాటు జైలు జీవితం అనుభవించిన గాలి జనార్ధన్ రెడ్డి శుక్రవారం జైలు నుంచి బయటకు వచ్చారు.
కాగా, గాలి విడుదల కోసం జైలు ముందు వేచివున్న అతని మద్దతుదారులు సంబరాలు జరుపుకున్నారు. జనవరి 20న సుప్రీం కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అక్రమ మైనింగ్ ఆరోపణలపై 2011, సెప్టెంబర్ 5న సిబిఐ అధికారులు ఆయనను బళ్లారిలోని ఆయన ఇంట్లోనే అరెస్ట్ చేశారు.
శ్రీనివాస్ రెడ్డికి బెయిల్ మంజూరు

ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్థన్రెడ్డి బంధువైన శ్రీనివాస్రెడ్డికి బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరుకు సంబంధించిన పూచీకత్తులను సీబీఐ కోర్టుకు సమర్పించాలని ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
చిదంబరం కుమారుడికి షోకాజ్ నోటీసులు
చెన్నై: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ సీనియర్ నేత,దివంగత కామరాజ్కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ఈ మేరకు నోటీసులను జారీ చేసింది. కామరాజ్పై చేసిన వ్యాఖ్యలపై వారంరోజుల్లోగా వివరణ ఇవ్వాలని కార్తీ చిదంబరాన్ని ఆదేశించింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications