బాలీవుడ్ చిత్రంతో సైకో కిల్లర్గా ఇన్ఫోసిస్ మాజీ టెక్కీ: 22మంది హత్య
పాట్నా: అతనొకప్పుడు ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్లో ఉద్యోగి. ఆ తర్వాత ఏమైందో ఏమోగానీ, ఓ బాలీవుడ్ చిత్రం చూసి సైకోగా మారిపోయాడు. అంతటితో ఆగకుండా సుమారు 22మందిని దారుణంగా హత్య చేశాడు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు. అతడే బీహార్కు అవినాశ్ శ్రీవాత్సవ అలియాస్ అమిత్(35). అతడ్ని వాచిరస్తున్న పోలీసులకు కూడా అతడు చుక్కలు చూపాడు.
'విచారణతో సమయం వృథా చేయకండి, సైకో కిల్లర్ అమిత్ అని గూగుల్లో టైప్ చేయండి.. నా గురించి తెలుస్తుంది' అంటూ వరుస హత్యల నిందితుడైన అవినాష్ పేర్కొనడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. కాగా, వైశాలి జిల్లాలో ఓ బ్యాంకులో డబ్బు దొంగతనం చేస్తుండగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు.
దొంగతనం కేసులో అరెస్టు చేసిన పోలీసులు విచారణలో అవినాష్ మాటలకు నిర్ఘాంతపోయారు. పోలీసుల కథనం ప్రకారం.. అవినాష్ శ్రీవాత్సవ అలియాస్ అమిత్(35), మాజీ ఎమ్మెల్సీ లల్లాన్ కుమారుడు.

ఢిల్లీ జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ నుంచి ఎంసీఏ పూర్తి చేసి కొన్నాళ్లు ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేశాడు. ఆ తర్వాత ఉద్యోగం మానేసి వైశాలి జిల్లా సహా పలు చోట్ల 22మందిని హత్య చేశాడు. 2003లో జరిగిన తండ్రి హత్యకు ప్రతీకారంగా హంతకులను ఒక్కొక్కరిగా చంపుతూ సీరియల్ కిల్లర్గా మారానని అతడు పేర్కొన్నాడు.
హంతకులలో ఒకరైన పప్పూఖాన్ శరీరంలో 32 బులెట్లు దించానని మిగిలిన నలుగురిని అదే విధంగా కాల్చి చంపానని తెలిపాడు. పైగా ఈ హత్యలన్నింటికీ 'గ్యాంగ్స్ ఆఫ్ వాస్సీపూర్-2' బాలీవుడ్ చిత్రంలోని ముగింపు సన్నివేశం తనకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చాడు. 1960ల్లో ముంబైలో వరుస హత్యలు చేసిన రమన్రాఘవ్ని కూడా అమిత్ ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకున్నాడని పోలీసులు వివరించారు.
-
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
66 ఏళ్ల వయసులో ఆ నటి తల్లి కాబోతుందా ??? -
ఎనిమిదేళ్లుగా వేధిస్తున్నారు.. ఇక ఊరుకోను: రష్మిక సంచలన పోస్టు.. -
హన్సిక భర్తకి అంతకు ముందే పెళ్లి జరిగిందని తెలుసా.. బెస్ట్ ఫ్రెండ్ తోనే !! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!!












Click it and Unblock the Notifications