సెల్పీ తీసుకొంటే అక్కడ ఫైన్ కట్టాల్సిందే
తమిళనాడు :టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ప్రజలకు సేవలు కూడ మరింత అందుబాటులోకి వచ్చాయి. సెల్ పోన్లలో రోజుకో రకమైన మార్పులు చేర్పులు వస్తున్నాయి. సెల్ ఫోన్లలో కెమెరాల ఆఫ్షన్ రావడం. వాటి నాణ్యత కూడ బాగా ఉండడంతో సెల్ ఫోన్ లోనే ఫోటోలు దిగే వారి సంఖ్య పెరిగిపోయింది. దానికి తోడు ఇటీవల సెల్పీల మోజు మరింత పెరిగింది. ఈ మోజు ఎంతవరకు వెళ్ళిదంటే సెల్పీల మోజులో పడి అనేకమంది తమ ప్రాణాలను కూడ పోగొట్టుకొన్నారు.
ఈ మద్య కాలంలో సెల్పీలను సామాజిక మాద్యమాల్లో పోస్టు చేస్తున్నారు.అయితే ఈ సెల్పీ ల కారణంగా ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే భావనతో తమిళనాడులోని ఊటీ సరస్సులో సెల్పీ దిగితే జరిమానాను విధిస్తున్నారు. ఈ జరిమానా భయంతో సెల్పీలు దిగే సంఖ్య పడిపోయింది.
తమిళనాడులోని నీలగిరి జిల్లా ఊటీకి ప్రతి రోజూ వందలాది మంది సందర్శకులు వస్తుంటారు. ఇక్కడ ఉన్న బొటానికల్ గార్డెన్, దొడబెట్ట, ముదుమలై ఊటీ బోట్ క్లబ్ లలో అధికంగా పర్యాటకులు సందర్శిస్తుంటారు.

బోట్ క్లబ్ లో సందర్శించే సమయంలో ప్రతి ఒక్కరూ సెల్పీ తీసుకొనేందుకు ఇష్టపడుతుంటారు. సెల్పీల కోసం పడవలో అటూ ఇటూ తిరగడం వల్ల పడవలు మునిగిపోయే ప్రమాదం నెలకొంది. సెల్పీల కోసం ఆరాటపడుతూ సరస్సులో పడిన సందర్భాలు నెలకొన్నాయి.దీంతో పర్యాటకశాఖాధికారులు కొత్త నిబంధనను తీసుకు వచ్చారు. బోటింగ్ సమయంలో సెల్పీ దిగితే జరిమానా విధించాలని నిర్ణయించారు. దీన్ని అమలు చేస్తున్నారు.
మరో వైపు నీలగిరి అటవీ ప్రాంతంలో జంతువులను ఫోటో తీసిన ఏడుగురు పర్యాటకులను జరిమానా విధించారు అధికారులు.అడవి జంతువుల వద్ద కూడ సెల్పీలు దిగడాన్ని నిషెదించారు. గతంలో ఓ అడవి దున్న తో సెల్పీ దిగే సమయంలో ఓ మహిళపై దున్నదాడి చేసింది. దీంతో ఆమె మరణించింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications