Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సెల్పీ తీసుకొంటే అక్కడ ఫైన్ కట్టాల్సిందే

తమిళనాడు :టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ప్రజలకు సేవలు కూడ మరింత అందుబాటులోకి వచ్చాయి. సెల్ పోన్లలో రోజుకో రకమైన మార్పులు చేర్పులు వస్తున్నాయి. సెల్ ఫోన్లలో కెమెరాల ఆఫ్షన్ రావడం. వాటి నాణ్యత కూడ బాగా ఉండడంతో సెల్ ఫోన్ లోనే ఫోటోలు దిగే వారి సంఖ్య పెరిగిపోయింది. దానికి తోడు ఇటీవల సెల్పీల మోజు మరింత పెరిగింది. ఈ మోజు ఎంతవరకు వెళ్ళిదంటే సెల్పీల మోజులో పడి అనేకమంది తమ ప్రాణాలను కూడ పోగొట్టుకొన్నారు.

ఈ మద్య కాలంలో సెల్పీలను సామాజిక మాద్యమాల్లో పోస్టు చేస్తున్నారు.అయితే ఈ సెల్పీ ల కారణంగా ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే భావనతో తమిళనాడులోని ఊటీ సరస్సులో సెల్పీ దిగితే జరిమానాను విధిస్తున్నారు. ఈ జరిమానా భయంతో సెల్పీలు దిగే సంఖ్య పడిపోయింది.

తమిళనాడులోని నీలగిరి జిల్లా ఊటీకి ప్రతి రోజూ వందలాది మంది సందర్శకులు వస్తుంటారు. ఇక్కడ ఉన్న బొటానికల్ గార్డెన్, దొడబెట్ట, ముదుమలై ఊటీ బోట్ క్లబ్ లలో అధికంగా పర్యాటకులు సందర్శిస్తుంటారు.

If take a selfie pay fine

బోట్ క్లబ్ లో సందర్శించే సమయంలో ప్రతి ఒక్కరూ సెల్పీ తీసుకొనేందుకు ఇష్టపడుతుంటారు. సెల్పీల కోసం పడవలో అటూ ఇటూ తిరగడం వల్ల పడవలు మునిగిపోయే ప్రమాదం నెలకొంది. సెల్పీల కోసం ఆరాటపడుతూ సరస్సులో పడిన సందర్భాలు నెలకొన్నాయి.దీంతో పర్యాటకశాఖాధికారులు కొత్త నిబంధనను తీసుకు వచ్చారు. బోటింగ్ సమయంలో సెల్పీ దిగితే జరిమానా విధించాలని నిర్ణయించారు. దీన్ని అమలు చేస్తున్నారు.

మరో వైపు నీలగిరి అటవీ ప్రాంతంలో జంతువులను ఫోటో తీసిన ఏడుగురు పర్యాటకులను జరిమానా విధించారు అధికారులు.అడవి జంతువుల వద్ద కూడ సెల్పీలు దిగడాన్ని నిషెదించారు. గతంలో ఓ అడవి దున్న తో సెల్పీ దిగే సమయంలో ఓ మహిళపై దున్నదాడి చేసింది. దీంతో ఆమె మరణించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+