బీజేపీతో పొత్తుపై పన్నీరుసెల్వం ట్విస్ట్: అందుకేనని కనిమొళి
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆధ్వర్యంలోని ఏఐఏడీఎంకే (పురట్చితలైవి అమ్మ) పార్టీ భావిస్తోంది.
చెన్నై: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆధ్వర్యంలోని ఏఐఏడీఎంకే (పురట్చితలైవి అమ్మ) పార్టీ భావిస్తోంది. ఆ పార్టీ శనివారం చేసిన ఓ ట్వీట్ ఈ అభిప్రాయాన్ని బలపరుస్తోంది.
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో పన్నీర్ సెల్వం భేటీ అయిన మరుసటి రోజునే ఈ ట్వీట్ రావడం గమనార్హం. అయితే ఆ తర్వాత కాసేపటికే దానిని తొలగించి సవరణను పెట్టారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రకటించిన తర్వాత బీజేపీతో పొత్తు విషయమై నిర్ణయం తీసుకుంటామని తొలుత ట్వీట్ చేశారు. వెంటనే దానిని తొలగించి.. స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటించిన తర్వాత ఏ రాజకీయ పార్టీతోనైనా పొత్తు పెట్టుకొనే విషయాన్ని ఆలోచిస్తామన్నది తమ ఉద్దేశ్యమని పేర్కొన్నారు.

ఇప్పుడేం చెప్పలేం
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బీజేపీతో పొత్తు ఉంటుందనే వూహాగానాలకు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం చెక్ పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల తేదీలను ప్రకటించిన తర్వాతే ఎవరితో పొత్తు పెట్టుకోవాలనేది నిర్ణయిస్తామన్నారు.
రజనీకాంత్పై..
మరోవైపు సినీ నటుడు రజనీకాంత్ తన అభిమానులతో సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరైన సమయంలో యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
రాజకీయ కారణాలే: కనిమొళి
ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవడానికి ప్రధాని మోడీతో పన్నీర్సెల్వం భేటీ అయ్యారని డీఎంకే మహిళా విభాగం కార్యదర్శి, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి ఆరోపించారు.
ముఖ్యమంత్రి అయ్యేందుకు స్టాలిన్ పగటి కలలు కంటున్నారని పన్నీర్సెల్వం విమర్శిస్తున్నారని, ఎన్నికలు వస్తే ఎవరు పగటి కలలు కంటున్నారనే విషయం తేలిపోతుందన్నారు. జీఎస్టీ వల్ల తమిళనాడుకు ఎక్కువ నష్టం వాటిల్లనుందని, దీనిని వ్యతిరేకిస్తూ డీఎంకే పోరాడనుందన్నారు.
ప్రధాని మోడీతో పన్నీర్సెల్వం భేటీ కావడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన ప్రధానిని కలిశారని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కాదని విమర్శించారు. అన్నాడీఎంకేను బీజేపీ నడిపిస్తోందని గతంలో తాము చెప్పామని, ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా వ్యాఖ్యలు దానిని ధ్రువీకరిస్తున్నాయన్నారు.
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications