మోడీకి 10 మార్కులిచ్చేది వారే: చిద్దూ, రామాలయం కట్టాల్సిందే: ఆరెస్సెస్
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏడాది పాలన పైన మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం సోమవారం నాడు విమర్శలు గుప్పించారు. ఉద్యోగ కల్పనలో మోడీ ప్రభుత్వానికి సున్నా మార్కులేనని అన్నారు. మోడీ ప్రభుత్వం 20 శాతం పాలనను పూర్తి చేసుకుందని, అయితే వారిచ్చిన హామీల మేరకు అభివృద్ధి కానీ, ఉద్యోగ కల్పన కానీ జరగలేదన్నారు.
డబ్బులొచ్చే పారిశ్రామికవేత్తలు మాత్రమే దీనికి పదికి పది మార్కులు వేస్తారన్నారు. ప్రభుత్వ ఉద్దేశాలు మంచివే అనుకున్నా, వాటిని విధానాలుగా రూపొందించి, కార్యక్రమాలుగా అమలు చేసే నిర్దిష్ట ప్రక్రియ కనిపించడం లేదని చెప్పారు. ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆరోపణలు చేయటమే అభివృద్ధి కాబోదన్నారు.
ఏడాది కాలంలో ప్రతిపక్షాలు అడ్డుకుంది జీఎస్టీ బిల్లు, భూసేకరణ బిల్లు మాత్రమేనని తెలిపారు. వాస్తవానికి మోడీ ప్రభుత్వం స్టాండింగ్ కమిటీలను కూడా పక్కకు తప్పించి 50 బిల్లుల్ని చట్టాలుగా ఆమోదించుకుందన్నారు. తమ ప్రభుత్వం బాగా పని చేస్తోందని ఊదరగొడుతోందన్నారు.

మరో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. ఎన్డీయే ప్రభుత్వాన్ని యూపీఏ3గా అభివర్ణించారు. యూపీఏ ప్రభుత్వ విధానాలనే మోడీ ప్రభుత్వం అవలంభిస్తోందన్నారు.
రామాలయం కట్టాల్సిందే: ఆరెస్సెస్
ఆరెస్సెస్ మరోసారి రామాలయ అంశాన్ని తెరపైకి తెచ్చింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రాములవారి గుడి కట్టాల్సిందేనని అల్టిమేటం జారీ చేసింది. ఎన్నికల హామీని నిలుపుకోవాలని ఆరెస్సెస్ సూచిస్తే, ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేందుకు విశ్వహిందూ పరిషత్ కార్యాచరణ రూపొందిస్తోంది.
బీజేపీ ప్రభుత్వం అయోధ్యలో రామాలయ నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దులపై ఎన్నికల హామీలను నెరవేర్చాలని ఆరెస్సెస్ అఖిల భారతీయ సహ సంపర్క్ ప్రముఖ్ అరుణ్ కుమార్ నాగపూర్లో సూచించారు.
వీహెచ్పీ అయితే, రామాలయ నిర్మాణానికి ఉన్న ప్రతిబంధకాలను తొలగించే దిశగా ప్రభుత్వంతో చర్చలకు సాధువుల ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు, హరిద్వార్లో జరుగుతోన్న వీహెచ్పీ కేంద్రీయ మార్గదర్శక్ మండల్ సమావేశం తొలిరోజున ఓ తీర్మానాన్ని ఆమోదించింది.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications