వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీరవ్ మోడీకి ద్వంద్వం పౌరసత్వం: 'భారత్ తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతాం'

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో జరిగిన భారీ స్కాంలో నిందితుడు నీరవ్‌ మోడీని భారత్‌కు తీసుకు వచ్చి, చట్టం ముందు నిలబెడతామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్‌ ప్రతాప్‌ శుక్ల వెల్లడించారు.

రూ.11,400 కోట్ల కుంభకోణాన్ని పరిష్కరించేందుకు పీఎంవోతో తమ శాఖ చర్చిస్తోందన్నారు. పీఎంఓ తీసుకొనే నిర్ణయాన్ని అమలు చేస్తామన్నారు. అక్రమాలకు పాల్పడిన నిందితులను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు.

పిఎన్‌బి స్కాం:'మోడీని కలవలేదు, నీరవ్ మామతో మీ ఫోటోలు', బ్యాంక్ ఉద్యోగికి విలాసవంత విల్లా పిఎన్‌బి స్కాం:'మోడీని కలవలేదు, నీరవ్ మామతో మీ ఫోటోలు', బ్యాంక్ ఉద్యోగికి విలాసవంత విల్లా

ఇదిలా ఉండగా, నీరవ్ మోదీకి ద్వంద్వ పౌరసత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈడీ సూచనల మేరకు నీరవ్‌, అతని బంధువు మెహుల్‌ ఛోక్సిల పాస్‌పోర్టులను విదేశీ వ్యవహారాలశాఖ నాలుగు వారాల పాటు రద్దు చేసింది.

Nirav Modi may have dual citizenship

అయితే, నీరవ్‌ అతని సోదరుడు నిషాల్‌ బెల్జియంలో పెరిగారనీ, వారికి ఆ దేశ పౌరసత్వం కూడా ఉండొచ్చని ది ట్రిబ్యూన్‌ పత్రిక పేర్కొంది.

నీరవ్‌కు ద్వంద్వ పౌరసత్వం ఉన్నట్లు పలానీపురీ జైన్‌ సామాజికవర్గానికి తెలుసునని ఆ కథనంలో పేర్కొంది. నిషాల్‌ భారత పాస్‌పోర్టును స్వాధీనపరచి, బెల్జియం పౌరసత్వం పొందాడనీ, నీరవ్‌ మాత్రం తాను భారతీయ పౌరుడినని ప్రకటించినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

English summary
PNB scam accused Nirav Modi may already be one-up on the authorities by illegally acquiring the citizenship of a foreign country even while holding an Indian passport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X