నీరవ్ మోడీకి ద్వంద్వం పౌరసత్వం: 'భారత్ తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతాం'
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన భారీ స్కాంలో నిందితుడు నీరవ్ మోడీని భారత్కు తీసుకు వచ్చి, చట్టం ముందు నిలబెడతామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్ల వెల్లడించారు.
రూ.11,400 కోట్ల కుంభకోణాన్ని పరిష్కరించేందుకు పీఎంవోతో తమ శాఖ చర్చిస్తోందన్నారు. పీఎంఓ తీసుకొనే నిర్ణయాన్ని అమలు చేస్తామన్నారు. అక్రమాలకు పాల్పడిన నిందితులను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
ఇదిలా ఉండగా, నీరవ్ మోదీకి ద్వంద్వ పౌరసత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈడీ సూచనల మేరకు నీరవ్, అతని బంధువు మెహుల్ ఛోక్సిల పాస్పోర్టులను విదేశీ వ్యవహారాలశాఖ నాలుగు వారాల పాటు రద్దు చేసింది.

అయితే, నీరవ్ అతని సోదరుడు నిషాల్ బెల్జియంలో పెరిగారనీ, వారికి ఆ దేశ పౌరసత్వం కూడా ఉండొచ్చని ది ట్రిబ్యూన్ పత్రిక పేర్కొంది.
నీరవ్కు ద్వంద్వ పౌరసత్వం ఉన్నట్లు పలానీపురీ జైన్ సామాజికవర్గానికి తెలుసునని ఆ కథనంలో పేర్కొంది. నిషాల్ భారత పాస్పోర్టును స్వాధీనపరచి, బెల్జియం పౌరసత్వం పొందాడనీ, నీరవ్ మాత్రం తాను భారతీయ పౌరుడినని ప్రకటించినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications