షాక్: రద్దుచేసిన నగదు డిపాజిట్కు నో ఛాన్స్
రద్దుచేసిన పాత నోట్లను డిపాజిట్ చేసుకొనేందుకు మరోసారి అవకాశం కల్పించే అవకాశం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తేల్చిచెప్పింది. ఈ మేరకు సోమవారంనాడు కేంద్రం తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు వెల్లడించింది.
న్యూఢిల్లీ: రద్దుచేసిన పాత నోట్లను డిపాజిట్ చేసుకొనేందుకు మరోసారి అవకాశం కల్పించే అవకాశం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తేల్చిచెప్పింది. ఈ మేరకు సోమవారంనాడు కేంద్రం తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు వెల్లడించింది.
రద్దుచేసిన రూ.500, రూ.1000 నోట్లను డిపాజిట్ చేసుకొనేందుకు మరోసారి అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు ఈ నెల మొదటి వారంలో కేంద్రానికి సూచించింది. అయితే ఈ సూచనను కేంద్రం తోసిపుచ్చింది.. చట్టబద్దత కానీ ఈ నోట్లను డిపాజిట్ చేసుకొనేందుకు ఎలాంటి అవకాశం కల్పించబోమని కేంద్రం ప్రకటించింది.

రద్దైన రూ.500, రూ. 1000 నోట్లను డిపాజిట్ చేసుకోవడానికి ఆఖరి అవకాశంగా వెసులుబాటు కల్పిస్తే డిమానిటైజేషన్ అసలైన ఉద్దేశ్యం నల్లధనానికి వ్యతిరేకంగా చేపట్టిన యుద్దం నిష్ప్రయోజనంగా మారుతోందని కేంద్రం అభిప్రాయపడింది.
సహేతుక కారణాలు తెలిపినవారికి డిపాజిట్ చేసుకొనేందుకు అవకాశం కల్పించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. తగిన కారణాలు చూపినవారికి ఇబ్బందులు సృష్టించకూడదని కూడ సలహ ఇచ్చింది.గతంలోనే అనేక దుర్వినియోగాలు చోటుచేసుకొన్న విషయాన్ని కేంద్రం సుప్రీంకు తెలిపింది. మరోసారి అవకాశం కల్పిస్తే బినామీ లావాదేవీలు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
గత ఏడాది నవంబర్ 8వ, తేదిన కేంద్రం పెద్ద నగదునోట్లను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకొంది. ఈ నోట్ల డిపాజిట్ల గడువు కూడ విధించింది. అయితే ఈ గడువు సరిపోలేదు. గడువు పెంచాలని కూడ వినతులు వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఈ సూచన చేసింది.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications