షాక్: రద్దుచేసిన నగదు డిపాజిట్కు నో ఛాన్స్
రద్దుచేసిన పాత నోట్లను డిపాజిట్ చేసుకొనేందుకు మరోసారి అవకాశం కల్పించే అవకాశం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తేల్చిచెప్పింది. ఈ మేరకు సోమవారంనాడు కేంద్రం తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు వెల్లడించింది.
న్యూఢిల్లీ: రద్దుచేసిన పాత నోట్లను డిపాజిట్ చేసుకొనేందుకు మరోసారి అవకాశం కల్పించే అవకాశం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తేల్చిచెప్పింది. ఈ మేరకు సోమవారంనాడు కేంద్రం తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు వెల్లడించింది.
రద్దుచేసిన రూ.500, రూ.1000 నోట్లను డిపాజిట్ చేసుకొనేందుకు మరోసారి అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు ఈ నెల మొదటి వారంలో కేంద్రానికి సూచించింది. అయితే ఈ సూచనను కేంద్రం తోసిపుచ్చింది.. చట్టబద్దత కానీ ఈ నోట్లను డిపాజిట్ చేసుకొనేందుకు ఎలాంటి అవకాశం కల్పించబోమని కేంద్రం ప్రకటించింది.
రద్దైన రూ.500, రూ. 1000 నోట్లను డిపాజిట్ చేసుకోవడానికి ఆఖరి అవకాశంగా వెసులుబాటు కల్పిస్తే డిమానిటైజేషన్ అసలైన ఉద్దేశ్యం నల్లధనానికి వ్యతిరేకంగా చేపట్టిన యుద్దం నిష్ప్రయోజనంగా మారుతోందని కేంద్రం అభిప్రాయపడింది.
సహేతుక కారణాలు తెలిపినవారికి డిపాజిట్ చేసుకొనేందుకు అవకాశం కల్పించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. తగిన కారణాలు చూపినవారికి ఇబ్బందులు సృష్టించకూడదని కూడ సలహ ఇచ్చింది.గతంలోనే అనేక దుర్వినియోగాలు చోటుచేసుకొన్న విషయాన్ని కేంద్రం సుప్రీంకు తెలిపింది. మరోసారి అవకాశం కల్పిస్తే బినామీ లావాదేవీలు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
గత ఏడాది నవంబర్ 8వ, తేదిన కేంద్రం పెద్ద నగదునోట్లను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకొంది. ఈ నోట్ల డిపాజిట్ల గడువు కూడ విధించింది. అయితే ఈ గడువు సరిపోలేదు. గడువు పెంచాలని కూడ వినతులు వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఈ సూచన చేసింది.