415 కు పెరిగిన ఒమిక్రాన్ కేసులు; అత్యధికంగా మహారాష్ట్రలోనే..తాజా కరోనాకేసుల స్థితి ఇదే!!
భారతదేశాన్ని కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తుంది. కేసులు పెరుగుతుండడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. భారతదేశంలో ప్రస్తుతం ఇప్పటి వరకు మొత్తం 415 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు కనీసం 115 మంది కోలుకున్నారని తెలిపింది.
దేశంలో మహారాష్ట్రలో అత్యధికంగా 108 మంది ఒమిక్రాన్ బాధితులను కలిగివుంది. ఢిల్లీలో 79 మంది ఒమిక్రాన్ వేరియంట్ బాధితులు ఉన్నారు. ఇప్పటివరకూ గుజరాత్లో 43 కేసులు, తెలంగాణాలో 38 కేసులు, కేరళలో మొత్తం 37 ఓమిక్రాన్ కేసులు, తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో ఏ రాష్ట్రం కూడా ఒమిక్రాన్ కేసులను నివేదించలేదు. ఇక రాజస్థాన్ ఇరవై రెండు కేసులను, హర్యానా నాలుగు కేసులను, ఒడిశా నాలుగు కేసులను, ఆంధ్రప్రదేశ్ నాలుగు కేసులను, జమ్మూ కాశ్మీర్ మూడు కేసులను, ఉత్తరప్రదేశ్ రెండు కేసులను, చండీగర్ ఒక కేసును, ఉత్తరఖండ్ ఒక కేసు, లడక్ ఒక కేసును నమోదు చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే విపరీతంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది సమావేశాలకు అనుమతి లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. హర్యానా మరియు ఢిల్లీ కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా ఆంక్షలను కఠినతరం చేశాయి. అయితే ఢిల్లీ ప్రార్థనా స్థలాలను తెరిచి ఉంచడానికి అనుమతించింది. గత 24 గంటల్లో 7,189 తాజా కేసులతో దేశం యొక్క కోవిడ్-19 సంఖ్య 3,47,79,815కి పెరిగింది. అయితే క్రియాశీల కేసులు 77,032కి తగ్గాయి.
ఇప్పటివరకు 3.42 కోట్ల మంది కరోనా మహమ్మారి జయించారు క్రియాశీల కేసుల రేటు 0.22 శాతంగా ఉంది. గత 58 రోజులుగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య 15,000 కంటే తక్కువగా నమోదైంది.ఇది మార్చి 2020 నుండి అతి తక్కువ, అయితే జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.40 శాతంగా నమోదైంది. గత 24 గంటల వ్యవధిలో 387 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు మొత్తంగా ఇప్పటివరకు 4,79,520 మంది కరోనా కారణంగా మృతి చెందారు. నిన్న 66 లక్షల మందికి కరోనా టీకా వేయించుకోగా మొత్తంగా 141 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications