బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Oxygen Express: బెంగళూరులో ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలు, కరోనా, ఐసీయూ కష్టాలకు బ్రేక్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ చెన్నై: ఐటీ హబ్ తో పాటు కర్ణాటకలో కోవిడ్ రోగుల ప్రాణాలను కాపాడటానికి కేంద్ర, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. సరైన సమయంలో ఆక్సిజన్ అందక ఇప్పటికే కర్ణాటకలో అనేక మంది కోవిడ్ రోగుల ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోయాయని ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో 120 టన్నుల మెడికల్ ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలు గ్రీన్ కారిడార్ మార్గంలో బెంగళూరు చేరుకునింది. ఇకనైనా బెంగళూరుతో పాటు కర్ణాటకలో ఐసీయూలో ఆక్సిజన్ కష్టాలకు బ్రేక్ పడుతాయని కోవిడ్ రోగులు, ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Second wife: ఆంటీకి లవర్స్, వాళ్ల ఫ్రెండ్స్ కూతురితో రొమాన్స్, భర్తకు తెలిసి, నడిరోడ్లో వేసేశాడు!Second wife: ఆంటీకి లవర్స్, వాళ్ల ఫ్రెండ్స్ కూతురితో రొమాన్స్, భర్తకు తెలిసి, నడిరోడ్లో వేసేశాడు!

పేరు చెబితే హడల్

పేరు చెబితే హడల్

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది. ఇప్పుడు కర్ణాటక పేరు చెబితో వామ్మో ? అంటూ ప్రజలు హడలిపోతున్నారు. కర్ణాటకలో ఎన్నడూ లేని విధంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. సోమవారం ఒక్కరోజు కర్ణాటకలో 39,305 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా చికిత్స విఫలమై గత 24 గంటల్లో (సోమవారం ఒక్కరోజు) కర్ణాటకలో 596 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

హైకోర్టు చెప్పింది చెయ్యాలి

హైకోర్టు చెప్పింది చెయ్యాలి

కర్ణాటకకు 1,200 టన్నుల మెడికల్ ఆక్సిజన్ సరఫరా చెయ్యాలని, ఇక్కడ పరిస్థితి విషమంగా ఉందని, ఆక్సిజన్ అందక ప్రజల ప్రాణాలు పోతున్నాయని, వెంటనే ఆక్సిన్ పంపించాలని కర్ణాటక హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక హైకోర్టు ఆదేశాలను కచ్చితంగా పాటించాని సుప్రీం కోర్టు సైతం ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

టాటా నగర్ టూ బెంగళూరు

టాటా నగర్ టూ బెంగళూరు

హైకోర్టు, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం రాంచీలోని టాటానగర్ నుంచి మెడికల్ ఆక్సింజన్ నిల్వ చేసిన ఆరు కంటేనర్లు ఉన్న ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలును బెంగళూరుకు పంపించింది. సోమవారం జంషడ్ పూర్ లో బయలుదేరిన ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలు మంగళవారం బెంగళూరులోని వైట్ ఫీల్డ్ లోని ఇన్ ల్యాండ్ కంటేనర్ డిపో (ICD)కు చేరుకుంది.

 మీ కోటా పంపించాం.... పీయూష్ గోయల్

మీ కోటా పంపించాం.... పీయూష్ గోయల్

ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలు ఎలాంటి ఆంటకాలు ఎదురుకాకుండా బెంగళూరు చేరుకోవడానికి గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశామని, అనుకున్న టైమ్ కు ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలు బెంగళూరు చేరుకోవడం సంతోషంగా ఉందని కేంద్ర రైల్వేశాఖా మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు.
బెంగళూరులోని వైట్ ఫీల్డ్ నుంచి నగరంలోని అనేక ఆసుపత్రులు, అనేక జిల్లాలకు ఆక్సిజన్ కంటేన్లు తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Recommended Video

Sonu Sood To Import Oxygen Plant From France | ఇంకో పది రోజుల్లో వస్తుంది || Oneindia Telugu
ప్రధాని, కేంద్ర మంత్రులకు థ్యాక్స్ చెప్పిన సీఎం

ప్రధాని, కేంద్ర మంత్రులకు థ్యాక్స్ చెప్పిన సీఎం

కర్ణాటకలో కోవిడ్ రోగులను ఆదుకోవడానికి 120 టన్నుల మెడికల్ ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలు పంపించారని, ఎప్పుడూ కర్ణాటక మీద శ్రద్ద చూపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కు, కేంద్ర మంత్రులు సదానంద గౌడ, ప్రహ్లాద్ జోషికి ధన్యవాదాలు అంటూ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ట్వీట్ చేశారు. ఇకనైనా ఐసీయూల్లో ఆక్సిజన్ కష్టాలు తీరితే ఎంతో మేలు అంటున్నారు కర్ణాటక ప్రజలు.

English summary
Oxygen Express: 120 tonnes First Oxygen Express Train reach Bengaluru City.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X