పారిపోయి హిజ్రాగా తిరిగొచ్చాడు: కొడుకును చూసి షాక్ తిన్న తల్లిదండ్రులు
మహిళగా మారాలనే ఉద్దేశంతోనే ఇంటి నుంచి పారిపోయి వచ్చానని చెప్పాడు. తన పేరు కీర్తనగా మార్చుకున్నానని ముత్తుకుమార్ తెలిపాడు.
అన్నానగర్: ఇంటి నుంచి పారిపోయిన ఓ యువకుడు రెండేళ్ల తర్వాత హిజ్రాగా మారి దర్శనమిచ్చాడు. హిజ్రాగా మారిన కొడుకును చూసి తల్లిదండ్రులు షాక్ తిన్నారు. తమిళనాడులోని తిరువూర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కె.సెట్టిపాళయం వోసి నగరానికి చెందిన తామరై సెల్వన్ కు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇందులో చిన్నకుమారుడ ముత్తుకుమార్(20) తిరువూర్ లోని బనియన్ సంస్థలో పనిచేసేవాడు. ఇదే క్రమంలో మార్చి, 2015 నెలలో అతను ఒక్కసారిగా మాయమైపోయాడు. పనికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన అతను మళ్లీ తిరిగి రాలేదు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పటి నుంచి వారు ముత్తుకుమార్ కోసం వెతుకుతూనే ఉన్నారు.

తాజాగా చెన్నైలోని వ్యాసర్ పాడిలో ముత్తుకుమార్ ఉన్నాడన్న సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లారు. అప్పటికే అతను హిజ్రాగా మారిపోయాడు. మహిళగా మారాలనే ఉద్దేశంతోనే ఇంటి నుంచి పారిపోయి వచ్చానని చెప్పాడు. తన పేరు కీర్తనగా మార్చుకున్నానని, చెన్నైలో తెలిసిన వ్యక్తి సహాయంతో మదురై వెళ్లి శస్త్రచికిత్స ద్వారా హిజ్రాగా మారానని పోలీసులకు వివరించాడు.
అనంతరం ముత్తుకుమార్ ఆచూకీ దొరికిందని పోలీసులు అతని కుటుంబ సభ్యులకు కబురుపెట్టారు. సంతోషంతో అక్కడికెళ్లిన తల్లిదండ్రులు చీరలో ఉన్న కుమారుడిని చూసి దిగ్భ్రాంతికి లోనయ్యారు. కొడుకును అలా చూసి వారి నోటవెంట మాట రాలేదు. అనంతరం ముత్తుకుమార్ ను కోర్టులో ప్రవేశపెట్టగా.. ముత్తుకుమార్ తనకు నచ్చినట్లుగా ఉండవచ్చునని మెజిస్ట్రేట్ నిత్యకళ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు విచారణ తర్వాత అతను తల్లిదండ్రులతో కలిసి చెన్నైకి చేరుకున్నట్లు సమాచారం.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications