రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ: కీలక విషయాలపై చర్చ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ను కలిశారు. గురువారం వారణాసి పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోడీ.. సాయంత్రం రాష్ట్రపతి భవన్కు వెళ్లి రామ్నాథ్ కోవింద్తో భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై ఆయనతో ప్రధాని చర్చించినట్లు రాష్ట్రపతి భవన్ తెలిపింది.
అయితే, ఏయే అంశాలపై రాష్ట్రపతితో చర్చించారనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. జులై 19 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ రాష్ట్రపతిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

కాగా, ప్రధాని మోడీ గురువారం తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించిన విషయం తెలిసిందే. రూ. 1500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ను ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రశంసించారు.
వారణాసిలో నిర్మించిన రుద్రాక్ష కనెన్షన్ సెంటర్ను గురువారం ప్రధాని మోడీ ప్రారంభించారు. గత ఏడేళ్లుగా వారణాసిని అభివద్ధి చేస్తున్నామని, తాజా నిర్మాణంతో కాశీ పుణ్య క్షేత్రం మరింత వెలుగులీనుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయ స్థాయి సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా జపాన్ టెక్నాలజీతో ఈ రుద్రాక్ష భవన నిర్మాణం చేపట్టారు. పర్యాటకులు, వ్యాపారవేత్తలను ఇది ఎంతగానో ఆకర్షిస్తుందని ప్రధాని మోడీ ఈ సందర్భంగా తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా స్టేజీ, సౌండింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశాసినట్లు తెలిపారు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications