ఎస్ఎం కృష్ణ బీజేపీలో చేరితే: ప్రధానికి హీరేమఠ్ హెచ్చరిక
మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణను బీజేపీలోకి తీసుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ క్రెడిబులిటీ దెబ్బతింటుందని సమాజ్ పరివర్తన సంస్థ వ్యవస్థాపకులు ఎస్ఆర్ హిరేమఠ్ హెచ్చరించారు. కృష్ణ అవినీతిపరుడు అన్నారు.
బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణను బీజేపీలోకి తీసుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ క్రెడిబులిటీ దెబ్బతింటుందని సమాజ్ పరివర్తన సంస్థ వ్యవస్థాపకులు ఎస్ఆర్ హిరేమఠ్ హెచ్చరించారు. కృష్ణ అవినీతిపరుడు అన్నారు.
ఆయనను బీజేపీలో చేర్చుకోవద్దని చెప్పారు. అవినీతిలో కూరుకుపోయిన ఎస్ఎం కృష్ణను బీజేపీలో చేర్చుకుంటే పార్టీకే నష్టమన్నారు. ఎస్ఎం కృష్ణ అల్లుడు సిద్దార్థ చిక్కమగళూరు జిల్లా కొప్ప తాలూకాలో 180 ఎకరాల అటవీభూమిని ఆక్రమించుకున్నారన్నారు.

అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ప్రధాని ఇలాంటి కబ్జాకోరులను పార్టీలో చేర్చుకోవడం సరికాదన్నారు. అవినీతిపరుల పాలిట దేశ వ్యాప్తంగా సింహస్వప్నం అనిపించుకుంటున్న ప్రధాని మోడీ.. అలాంటి వారిని చేర్చుకునే అంశంపై ఆలోచించాలన్నారు.
తేల్గీ స్టాంపుల కుంభకోణంలో సిద్దార్థ పేరుందని, కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ను కిడ్నాప్ చేసిన వీరప్పనకు నగదు సమకూర్చడంలో సిద్దార్థ మధ్యవర్తిగా వ్యవహరించారని ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు పాటించినవారికి బీజేపీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా సోదరి మృతితో బీజేపీలో చేరే ప్రక్రియకు అంతరాయం కల్గిన తరుణంలో వెనుతిరిగి వచ్చిన ఎస్ఎం కృష్ణ సోమవారం ఢిల్లీకి బయలుదేరుతున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాతోపాటు పలువురు ముఖ్యునేతలతో చర్చలు జరిపే అవకాశముంది. కర్నాటకలో ఉప ఎన్నికలలో ప్రచారం నేపథ్యంలో వెనువెంటనే ఎస్ఎం కృష్ణ బీజేపీలో చేరే అవకాశముంది.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications