వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావోయిస్ట్ ల చెర నుండి రాకేశ్వర్ సింగ్ విడుదల ... ధృవీకరించిన ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ ఐజీ

|
Google Oneindia TeluguNews

ఏప్రిల్ 2వ తేదీన ఛత్తీస్గఢ్ లోని సుక్మా బీజాపూర్ ప్రాంతంలో మావోయిస్టుల మెరుపుదాడి సమయంలో మావోయిస్టు ఎత్తుకెళ్లిన కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ కు మావోయిస్టులు చెర నుండి విముక్తి లభించింది. ఐదు రోజులుగా రాకేశ్వర సింగ్ విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన అందరిలో వ్యక్తమైంది.

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ ఎన్‌కౌంటర్ .. నిఘా వైఫల్యం లేదు , దాదాపు 30 మంది నక్సల్స్ హతం : సీఆర్పీఎఫ్ చీఫ్ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ ఎన్‌కౌంటర్ .. నిఘా వైఫల్యం లేదు , దాదాపు 30 మంది నక్సల్స్ హతం : సీఆర్పీఎఫ్ చీఫ్

రాకేశ్వర్ సింగ్ విడుదల కోసం కుటుంబంతో పాటు పలువురు విజ్ఞప్తి

రాకేశ్వర్ సింగ్ విడుదల కోసం కుటుంబంతో పాటు పలువురు విజ్ఞప్తి

రాకేశ్వర్ సింగ్ ను విడుదల చేయాలంటూ అతని కుటుంబ సభ్యులతో పాటుగా, పలువురు మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. రాకేశ్వర్ సింగ్ కుమార్తె తన తండ్రిని విడుదల చేయాలని నక్సల్స్ అంకుల్స్ అంటూ దీనంగా ఏడుస్తూ విజ్ఞప్తి చేసింది. ఇక వీడియో వైరల్ గా మారింది. అంతేకాదు ప్రొఫెసర్, మానవ హక్కుల కార్యకర్త జి హరగోపాల్ నేతృత్వంలోని తెలంగాణలో జరిగిన ఫోరమ్ ఎగైనెస్ట్ రిప్రెషన్ మావోయిస్టులు బందీగా ఉంచిన కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్‌ను వదిలిపెట్టాలని విజ్ఞప్తి చేసింది.

మధ్యవర్తిని పంపాలన్న మావోలు .. తమకు పోలీసులు శత్రువులు కాదని లేఖ

మధ్యవర్తిని పంపాలన్న మావోలు .. తమకు పోలీసులు శత్రువులు కాదని లేఖ

దీంతో తమకు పోలీసులు శత్రువులు కాదంటూ, తమపై దాడి చేసేందుకు వచ్చిన క్రమంలోనే అతన్ని పట్టుకున్నామంటూ మధ్యవర్తిని పంపిస్తే విడుదల చేస్తామంటూ మావోయిస్టులు లేఖ రాశారు. జవాన్ రాకేశ్వర సింగ్ క్షేమంగా ఉన్నాడని అతని ఫోటో ను సైతం విడుదల చేశారు. అయితే అది పాత ఫోటో అని, రాకేశ్వర్ క్షేమం పై ఆందోళన వ్యక్తం చేస్తూ రహదారిపై బైఠాయించారు రాకేశ్వర్ కుటుంబ సభ్యులు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అసహనం వ్యక్తం చేశారు .

 రాకేశ్వర్ సింగ్ ను విడుదల చేసిన మావోలు .. ధృవీకరించిన చత్తీస్ గడ్ ఐజీ

రాకేశ్వర్ సింగ్ ను విడుదల చేసిన మావోలు .. ధృవీకరించిన చత్తీస్ గడ్ ఐజీ

ఎట్టకేలకు నేడు ప్రభుత్వం అధికారికంగా ఏ మధ్యవర్తిని నియమించనప్పటికీ, రాకేశ్వర్ విడుదల కోసం విజ్ఞప్తి చేసే ప్రయత్నంలో గిరిజన కార్యకర్త సోని సోరి బీజాపూర్ ప్రాంతానికి వెళ్ళారు . ఐదు రోజులుగా మావోయిస్టుల చెరలో ఉన్న రాకేశ్వర్ సింగ్ ను ఎట్టకేలకు విడుదల చేసినట్టు చత్తీస్గడ్ ఐజి ధ్రువీకరించారు. టెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టులు వదిలి వేశారని, కాసేపట్లో జవాన్ రాకేశ్వర్ సింగ్ బెటాలియన్ కు చేరుకుంటారని తెలుస్తుంది.

 ఏప్రిల్ 2 న ఛత్తీస్‌ గడ్ లోని సుక్మా-బీజాపూర్ ప్రాంతంలో మావోల బందీగా రాకేశ్వర్ సింగ్

ఏప్రిల్ 2 న ఛత్తీస్‌ గడ్ లోని సుక్మా-బీజాపూర్ ప్రాంతంలో మావోల బందీగా రాకేశ్వర్ సింగ్

210 వ కోబ్రా బెటాలియన్‌తో కమాండో అయిన రాకేశ్వర్‌ను ఏప్రిల్ 2 న ఛత్తీస్‌ గడ్ లోని సుక్మా-బీజాపూర్ ప్రాంతంలో ఘోరమైన ఆకస్మిక దాడిలో మావోయిస్టులు పట్టుకున్నారు. అప్పటి నుండి ఆయన జాడ కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. అలాగే మావోల ఏరివేతకు కేంద్రం రంగం సిద్ధం చేసింది . మావోలు చేసిన అతి పెద్ద మెరుపు దాడిలో 24 మంది జవాన్లు మరణించటం కేంద్రం జీర్ణించుకోలేకపోతుంది . ఏది ఏమైనా మావోయిస్ట్ ల చెరలో ఉన్న రాకేశ్వర్ సింగ్ విడుదలతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు . దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

English summary
Cobra Commando Rakeshwar Singh, who was abducted by Maoists during a Maoist ambush in Sukma Bijapur area of ​​Chhattisgarh on April 2, has been released from Maoist custody. The Chhattisgarh IG confirmed that Rakeshwar Singh, who had been in Maoist custody for five days, had finally been released. It is learned that Rakeshwar Singh was dropped off by the Maoists at Terram police station and Jawan Rakeshwar Singh will join the battalion shortly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X