Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వర్షాకాలం వచ్చేసింది: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

న్యూఢిల్లీ: వేసవి కాలం ఎండలతో అల్లాడిపోతున్న జనాలకు చల్లటి కబురు అందింది. అనుకున్నదాని కంటే మూడు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళ గుండా దేశంలోకి ప్రవేశించాయి.

మంగళవారం ఈ రుతుపవనాలు కేరళను తాకినట్లు భారత వాతావరణ సంస్థ(ఐఎండీ) వెల్లడించింది. నైరుతి రాకతో ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనట్లు పేర్కొంది. తొలుత జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు.

Southwest monsoon hits Kerala: IMD

అయితే, మూడు రోజుల ముందుగానే అంటే మే 29నే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. కాగా, ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అధికారులు అంచనా వేశారు.

రుతుపవనాల రాకతో కేరళతోపాటు తమిళనాడు, కర్ణాటకలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కాగా, రుతుపవనాలు సోమవారమే కేరళను తాకినట్లు స్కైమెట్ పేర్కొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+