వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వర్షాకాలం వచ్చేసింది: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వేసవి కాలం ఎండలతో అల్లాడిపోతున్న జనాలకు చల్లటి కబురు అందింది. అనుకున్నదాని కంటే మూడు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళ గుండా దేశంలోకి ప్రవేశించాయి.

మంగళవారం ఈ రుతుపవనాలు కేరళను తాకినట్లు భారత వాతావరణ సంస్థ(ఐఎండీ) వెల్లడించింది. నైరుతి రాకతో ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనట్లు పేర్కొంది. తొలుత జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు.

Southwest monsoon hits Kerala: IMD

అయితే, మూడు రోజుల ముందుగానే అంటే మే 29నే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. కాగా, ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అధికారులు అంచనా వేశారు.

రుతుపవనాల రాకతో కేరళతోపాటు తమిళనాడు, కర్ణాటకలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కాగా, రుతుపవనాలు సోమవారమే కేరళను తాకినట్లు స్కైమెట్ పేర్కొంది.

English summary
The southwest monsoon hit Kerala on Tuesday, three days before its scheduled arrival, says the India Meteorological Department (IMD).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X