ఎన్డీటీవీని సొంతం చేసుకోనున్న స్పైస్ జెట్ అజయ్ సింగ్!?
ఎన్డీటీవీగా సుపరిచితమైన న్యూఢిల్లీ టెలివిజన్ సంస్థను స్పైస్ జెట్ సహ వ్యవస్థాపకుడు అజయ్ సింగ్ సొంతం చేసుకోనున్నారనే వార్తలు వెలువడగానే దాని వాటాలను సొంతం చేసుకునేందుకు శుక్రవారం ఉదయం పెద్దఎత్తున ఇన్వెస
న్యూఢిల్లీ: ఎన్డీటీవీగా సుపరిచితమైన న్యూఢిల్లీ టెలివిజన్ సంస్థను స్పైస్ జెట్ సహ వ్యవస్థాపకుడు అజయ్ సింగ్ సొంతం చేసుకోనున్నారని, ఇప్పటికే ఆయన మెజారిటీ వాటాలను కొనుగోలు చేశారని వచ్చిన వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచాయి.
ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఎన్డీటీవీ వాటాలను సొంతం చేసుకునేందుకు పెద్దఎత్తున ఇన్వెస్టర్లు ఎగబడటంతో ఈ ఉదయం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ లో ఎన్డీటీవీ ఈక్విటీ విలువ 5 శాతం అప్పర్ సర్క్యూట్ ను తాకింది.

ఉదయం 9.25 గంటల సమయానికి 23,402 వాటాలు చేతులు మారేవరకు క్రితం ముగింపుతో పోలిస్తే 5 శాతం పెరిగి రూ. 53.10కు ఎన్డీటీవీ ఈక్విటీ విలువ చేరుకుంది. దీంతో అధికారులు ట్రేడింగ్ ను నిలిపివేశారు. అప్పటికే ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో 2.18 లక్షల ఈక్విటీల కోసం కొనుగోలు ఆర్డర్లు పేరుకుపోయాయి.
ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ లతో పాటు ప్రమోటర్ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై సీబీఐ కేసు నడుస్తూ ఉండటంతో సంస్థ ఈక్విటీ గత కొద్దికాలంగా దిగజారుతూ వస్తోంది.
ఈ నేపథ్యంలో ఎన్డీటీవీ యాజమాన్యం మారనుందని, అజయ్ సింగ్ చేతుల్లోకి వెళ్లనుందని 'ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్' శుక్రవారం నాడు ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో ఈక్విటీ విలువ ఒక్కసారిగా పెరిగిందని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానించారు.
ఆగస్టు 9న ఏడాది కనిష్ఠ స్థాయిలో రూ. 33.50 వద్ద ఉన్న ఎన్డీటీవీ ఈక్విటీ విలువ ఐదు వారాల వ్యవధిలో 80 శాతం వరకూ పెరగడం గమనార్హం. ఇక ఇదే వార్త స్పైస్ జెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను హరించగా, ఆ సంస్థ ఈక్విటీ 2 శాతం నష్టపోయి రూ. 143 వద్ద కొనసాగుతోంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications