ఉగ్రఘాతుకం: బీడీసీపై కాల్పులు, ఇద్దరు మృతి.. మరొకరికి గాయాలు
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోపోర్ జిల్లాలో గల మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజాప్రతినిధుల సమావేశమే లక్ష్యంగా కాల్పులతో విరుచుకుపడ్డారు. కాల్పుల్లో గన్మ్యాన్ షఫ్కత్ అహ్మద్, కౌన్సిలర్ రియాజ్ అహ్మద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో కౌన్సిలర్ షంషుద్దీన్ పీర్ గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాల్పుల నుంచి బీడీసీ చైర్ పర్సన్ ఫరీదా ఖాన్ తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు.

కాల్పుల నేపథ్యంలో జమ్ముకశ్మీర్ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. సోపోర్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కాల్పులు జరిపి పారిపోయిన ఉగ్రవాదుల కోసం ఘటనా ప్రాంతంలో, దాని పరిసరాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. కాల్పుల ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని కశ్మీర్ ఐజీ విజయ్కుమార్ తెలిపారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications