ఉగ్రఘాతుకం: బీడీసీపై కాల్పులు, ఇద్దరు మృతి.. మరొకరికి గాయాలు
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోపోర్ జిల్లాలో గల మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజాప్రతినిధుల సమావేశమే లక్ష్యంగా కాల్పులతో విరుచుకుపడ్డారు. కాల్పుల్లో గన్మ్యాన్ షఫ్కత్ అహ్మద్, కౌన్సిలర్ రియాజ్ అహ్మద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో కౌన్సిలర్ షంషుద్దీన్ పీర్ గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాల్పుల నుంచి బీడీసీ చైర్ పర్సన్ ఫరీదా ఖాన్ తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు.

కాల్పుల నేపథ్యంలో జమ్ముకశ్మీర్ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. సోపోర్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కాల్పులు జరిపి పారిపోయిన ఉగ్రవాదుల కోసం ఘటనా ప్రాంతంలో, దాని పరిసరాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. కాల్పుల ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని కశ్మీర్ ఐజీ విజయ్కుమార్ తెలిపారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications