ఆవుల్ని దొంగిలించారు: ఇద్దరు దళిత యువకులకు గుండు కొట్టించారు
లక్నో: ఆవులను దొంగిలించినందుకు ఇద్దరు యువకులకు గుండు కొట్టించిన సంఘటన ఉత్తర ప్రదేశ్లో చోటు చేసుకుంది. యూపీలోని బలియాలో ఈ సంఘటన సోమవారం నాడు జరిగింది.
ఇద్దరు దళిత యువకులు ఆవులను దొంగిలించినందుకు గాను వారికి గుండు కొట్టించి, వీధుల వెంట తిప్పారు. వారి మెడలో ఆవు దొంగలు అని హిందీలో రాసిన ప్లకార్డును పెట్టారు. ఆవులను దొంగిలించినందుకు ఇలా చేసినట్లు పేర్కొన్నారు.
ఆవులను దొంగిలించినందుకు గాను ఉమ, సోను అనే ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఓ ఆలయంలో ఆవులను దొంగిలించిన ఆ ఇద్దరిని కొందరు గ్రామస్తులు చూశారు. దీంతో వారికి గుండు కొట్టించి రోడ్లపై తిప్పారు. వారిద్దరి పైన చేయి కూడా చేసుకున్నారని పోలీసులు తెలిపారు.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో హల్చల్ చేస్తోంది. అవులను దొంగిలించిన యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆవులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, వారిపై చేయి చేసుకున్న వారి విషయంలోను విచారణ జరుగుతోందని చెప్పారు. వారిని కొట్టిన గ్రామస్తుల పైన చర్యలు తీసుకుంటామన్నారు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications