కొన్ని తప్పుడు నిర్ణయాలను తీసుకున్నాం..ఆ మాట నిజమే: తేల్చేసిన అమిత్ షా
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేబినెట్లో అత్యంత శక్తిమంతుడిగా పేరు తెచ్చుకున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం కొన్ని తప్పుడు నిర్ణయాలను తీసుకుందని కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వపరంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నామని ఆయన అంగీకరించారు. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారి తీసిన మూడు వ్యవసాయ చట్టాలు, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ).. వంటి అంశాల గురించి ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) 94వ వార్షిక సర్వసభ్య సమావేశానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. పాలనాపరంగా కొన్ని తప్పుడు నిర్ణయాలను తాము తీసుకున్నామని, ఉద్దేశం మాత్రం తప్పు కాదని స్పష్టం చేశారు. తమ ఉద్దేశం ఎప్పుడూ దేశ ప్రయోజనాలతో ముడిపడి ఉంటుందని తేల్చి చెప్పారు. దేశాన్ని కాదని వ్యక్తులు లేదా సంస్థలకు ప్రయోజనాలను కట్టబెట్టాలనేది తమ ఉద్దేశం కాదని పేర్కొన్నారు.

ఏడు సంవత్సరాల తమ ప్రభుత్వ హయాంలో ఏనాడు అవినీతి మాట వినిపించలేదని అన్నారు. తమ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు రాలేదని అన్నారు. అవినీతి మరకకు దూరంగా తమ పాలన సాగుతోందని, దాన్ని కొనసాగిస్తామని అమిత్ షా చెప్పారు. కొన్ని నిర్ణయాలు తప్పే అయినప్పటికీ.. తమ ఉద్దేశం సరైనది కావడం వల్ల అవినీతి మరక అంటలేదని అన్నారు. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలు, ప్రజల సంక్షేమం కోసం పలు విధానపరమైన నిర్ణయాలను తీసుకున్నామని గుర్తు చేశారు.
కరోనా సంక్షోభ పరిస్థితులను గట్టెక్కిన తరువాత.. దేశం రెండంకెల వృద్ధి రేటును అందుకుంటుందని తాను ముందు నుంచీ ఆశిస్తున్నానని అమిత్ షా అన్నారు. రెండంకెల వృద్ధిరేటును అందుకోవడం తనకు పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించలేదని చెప్పారు. కరోనా బారిన పడి కోలుకున్న దేశాల్లో భారత్ శరవేగంగా ఆర్థికాభివృద్ధిని సాధించిందని అన్నారు. మరే దేశం కూడా రెండంకెల అభివృద్ధిని అందుకునే పరిస్థితులు లేవని చెప్పారు.
దేశ ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక రంగం పురోగమించడానికి మూల స్తంభాలుగా భావించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవడానికి అనేక పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. వాటిని కొనసాగిస్తామని పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనల్లోనూ ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. దేశ స్థూల జాతీయోత్పత్తిలో పారిశ్రామిక రంగం వాటా కీలకమైదని అమిత్ షా వ్యాఖ్యానించారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications