చేపలకూర మిస్సవుతా: గోవా సిఎం మనోహర్ పారికర్
న్యూఢిల్లీ: తాను ఒకవేళ కేంద్రమంత్రినై ఢిల్లీకి వెళ్లిపోతే తనకు ఇష్టమైన చేపల కూరను మిస్సవుతానని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చెప్పారు. ఎన్డీటీవీ కథనం ప్రకారం.. కీలకమైన రక్షణ శాఖ, ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతున్న అరుణ్ జైట్లీపై భారాన్ని తగ్గించేందు కోసం రక్షణశాఖను మనోహర్ పారికర్కు కేటాయించే అవకాశాలున్నాయి.
58ఏళ్ల గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ రాజకీయాల్లోకి వచ్చి దాదాపు 20 ఏళ్లు పూర్తయ్యాయి. పారికర్ మంచి పరిపాలనదక్షుడు కావడంతో బిజెపి అధిష్టానం అతనికే రక్షణ శాఖను అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే పారికర్ కొద్ది రోజుల్లోనే కేంద్రమంత్రిగా రాష్ట్రం వదిలి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది.
ఈ పరిస్థితుల్లో ఆయన మనోభావాలను మీడియాతో పంచుకున్నారు. గోవాకి సంబంధించి మీరు ఏం మిస్సవబోతున్నారు? అని మీడియా అడిగిన ప్రశ్నకు పారికర్ సమాధానం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. తాను గోవా చేపల కూరను చాలా మిస్సవుతానని ఆయన పేర్కొన్నారు.

అయితే రోజుకు 16 నుంచి 18 గంటలపాటు పని చేసే తాను ఏ మాత్రం హడావుడి పడకుండా ప్రశాంతంగా ఉండే గోవా సంస్కృతిని మాత్రం ఒంటబట్టించుకోలేదని అన్నారు. పారికర్ ముంబై ఐఐటీ చదువుతకున్నారు.
కష్టజీవిగా, మచ్చలేని నేతగా పేరొందిన మనోహర్ పారికర్కు ప్రధాని నరేంద్ర మోడీ రక్షణ శాఖ అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. శనివారం ఆయన సిఎం పదవికి రాజీనామా చేయవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే మనోహర్ పారికర్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉండగా, బిజెపి పార్లమెంటరీ సమావేశం తర్వాత శనివారం గోవా సిఎం పదవికి మనోహర్ పారికర్ రాజీనామా చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయనను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించే అవకాశముందని తెలిపాయి. త్వరలోనే ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా, శనివారం సాయంత్రం గోవా కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని మనోహర్ పారికర్ చెప్పారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications