రేప్ కేసు పెడతా: మహిళని 12 ముక్కలు నరికాడు
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాదోల్ జిల్లాలో దారుణం జరిగింది. అత్యాచారం కేసు పెడతానని ఓ మహిళ బెదిరించడంతో, 48 ఏళ్ల వ్యక్తి ఆమెను ఏకంగా 12 ముక్కలుగా నరికేశాడు. ఆమె మృతదేహం భాగాలు జూలై 24వ తేదీన రైల్వే ట్రాక్ పక్కన కనిపించాయి.
నిందితుడిని కోషోర్ యాదవ్గా పోలీసులు గుర్తించారు. ఇతను రైల్వే ఉద్యోగి. అతనిని పోలీసులు మంగళవారం నాడు కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు అతనిని సోమవారం నాడు రాత్రి అరెస్టు చేశారు.
నిందితుడు సదరు మహిళ చేతులను, కాళ్లను, తలను ముక్కలు ముక్కలుగా నరికేశాడు. అనంతరం ఓ సైకిల్ పైన వాటిని తీసుకు వెళ్లి షాదోల్ - అనుప్పర్ రైల్వే లైన్ మధ్యలో పడేశాడు. ఇది అతని ఇంటికి 500 మీటర్ల దూరంలో ఉంది.
ఈ హత్య గురించి ఎలాంటి విషయం తెలియదని, కానీ నిందితుడి ఇంటి వద్ద రక్తం, పగిలిన గాజులు కనిపించాయని, దీంతో హత్య విషయం బయటపడిందని పోలీసులు చెప్పారు.
అతనిని అరెస్టు చేసి, విచారణ జరిపామని పోలీసులు చెప్పారు. విచారణలో అతను తన తప్పును అంగీకరించాడని చెప్పారు.
నిందితుడు కిషోర్ యాదవ్, హత్య గావించబడిన మహిళ మధ్య వివాహేతర సంబంధం ఉందా లేదా తెలియాల్సి ఉందన్నారు. యాదవ్ ప్రస్తుతం ఒక్కడే తన ఇంటిలో నివసిస్తున్నాడని, అలాగే మృతురాలు వితంతువు అని చెప్పారు.
శనివారం రాత్రి ఆమె కిషోర్ యాదవ్ ఇంటికి వచ్చి అత్యాచారం కేసు పెడతానని బెదిరించిందని, కోపోద్రిక్తుడైన అతను ఆమెను తొలుత గొడ్డలితో చంపేశాడని చెప్పారు. ఆ తర్వాత ఆమెను ముక్కలు ముక్కలుగా నరికేశాడని చెప్పారు.