Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దిగ్భ్రాంతికి గురిచేసేలా: మహిళలపై కాంగ్రెస్ నేత వివాదస్పద కామెంట్స్!

శరీరం మలినంగా ఉన్నప్పుడు, చర్చిలు, మసీదులు, ఆలయాలకు వారు వెళ్లకపోవడమే మంచిదని కేరళ పీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపేవిగా మారాయి.

త్రివేండ్రం: కేరళ కాంగ్రెస్‌కు తాత్కాళిక పీసీసీ చీఫ్‌గా నియమితులైన ఎంఎం హసన్.. పదవి చేపట్టిన వెంటనే మహిళలపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనకు పట్టుబట్టి మరీ ఆ పదవి ఇప్పించుకున్న మాజీ సీఎం ఉమెన్ చాందీని సైతం తప్పుపట్టే పరిస్థితి తలెత్తింది.

మహిళల రుతుస్రావం అంశాన్ని ప్రస్తావిస్తూ ఎంఎం హసన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. రుతుస్రావం సమయంలో మహిళలు మలినంగా ఉంటారు కాబట్టి ఆ సమయంలో ఆధ్యాత్మిక ఆలయ ప్రదేశాల్లోకి వారిని అనుమతించకపోవడమే మంచిదని వ్యాఖ్యానించారు.

Women Can't Enter Any Place of Worship While Menstruating: Kerala Congress Chief

మహిళలను రుతుస్రావం సమయంలో ఆలయాల్లోకి రానివ్వకూడదని, దీని వెనుక ఓ సైంటిఫిక్ కారణం కూడా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. దీనిని తప్పుగా వ్యాఖ్యానించకూడదని, రుతుస్రావం సమయంలో మహిళలు ఉపవాసం కూడా ఉండరాదని చెప్పారు. శరీరం మలినంగా ఉన్నప్పుడు, చర్చిలు, మసీదులు, ఆలయాలకు వారు వెళ్లకపోవడమే మంచిదని సలహా ఇచ్చారు. ఎంఎం హసన్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపేవిగా మారాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+