Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మయన్మార్‌లో సైన్యం మారణహోమం: 91 మంది మృతి, చిన్నారి కంటికి తగిలిన బుల్లెట్(వీడియో)

యంగూన్: మయన్మార్‌లో సైనికుల అరాచకాలు కొనసాగుతున్నాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వం కావాలంటూ ఆందోళనలు చేస్తున్న ప్రజలన సైనికులు విచక్షణారహితంగా అణిచివేస్తున్నారు. ఇప్పటికే సైనికుల కాల్పుల్లో వందలాది మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు.

తాజాగా, శనివారం మయన్మార్‌లోని పలు ప్రాంతాల్లో సైనికులు, పోలీసులు జరిపిన కాల్పుల్లో 91 మందికిపైగా ప్రజలు మరణించారు. ఈ మేరకు స్థానిక మీడియా సంస్థ మయన్మార్ నౌ న్యూస్ పోర్టల్ వెల్లడించింది.

At least 50 killed by security forces in Myanmar

మయన్మార్‌లో రెండో అతిపెద్ద నగరమైన మండలే నగరంలో 13 మంది మరణించగా, ఈ ప్రాంతానికి సమీపంలోని సగాయింగ్ లో 9 మంది, వాణిజ్య రాజధాని యంగూన్‌లో ఏడుగురు మరణించారు. రబ్బరు బుల్లెట్ల కాల్పుల్లో పలువురు చిన్నారులు కూడా తీవ్రంగా గాయపడ్డారు.

కాగా, సైన్యం జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు 300 మందికిపైగా నిరసనకారులు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి న్యాయవాదులు, మీడియా విడుదల చేసిన నివేదికలో తేలింది. తుపాకీతో కాల్చడం వల్లే 90 శాతం మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.

మరోవైపు మయన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టి సైనిక పాలన విధించిన ఆ దేశ ఆర్మీ.. సైనిక దళాల దినోత్సవాన్ని ఘనం నిర్వహించింది. నేపిడాలో జరిగిన ఈ వేడుకలకు మయన్మార్ కమాండర్ ఇన్ చీఫ్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లాయింగ్ హాజరయ్యారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందునే అంగ్ సాన్ సూకీ అధికారం చేపట్టకుండా అడ్డుకున్నామని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న సైన్యానికి ప్రజలు సహకరించాలని కోరుతూ తన చర్యల్ని ఆయన సమర్థించుకోవడం గమనార్హం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+