పార్లమెంట్ వద్ద దాడి చేసింది బ్రిటన్ వ్యక్తే: ప్రధాని థెరిస్సా
బ్రిటన్ పార్లమెంటుపై దాడికి పాల్పడి, పోలీసుల చేతిలో హతమైన దుండగుడు బ్రిటన్లో జన్మించిన వ్యక్తేనని బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే వెల్లడించారు. అతడి గురించి వివరాలను ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించినట్లు.
లండన్: బ్రిటన్ పార్లమెంటుపై దాడికి పాల్పడి, పోలీసుల చేతిలో హతమైన దుండగుడు బ్రిటన్లో జన్మించిన వ్యక్తేనని బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే వెల్లడించారు. అతడి గురించి వివరాలను ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించినట్లు గురువారం తెలిపారు.
దుండగుడు బ్రిటన్లో జన్మించిన వ్యక్తి అని తేలిందని, కొన్నేళ్ల క్రితం అతడిపై హింసాత్మక తీవ్రవాదానికి సంబంధించి విచారణ జరిగిందన్నారు. ఈ కేసు ప్రత్యేకమైనదని, ప్రస్తుతం అతడు ఇంటలిజెన్స్ పరిధిలో లేడన్నారు.

ముందస్తు దాడిపై ఎలాంటి సూచన గానీ ఆధారం గానీ ఇంటలిజెన్స్ వర్గాలకు అందలేదన్నారు. కాగా, నిన్న పార్లమెంట్ వద్ద దాడి జరిగింది. ఆ సమయంలో పార్లమెంటులోనే సభ్యులు ఉన్నారు.
ఈ రోజు పార్లమెంట్ తిరిగి సమావేశమైంది. థెరిసా మే పార్లమెంటులో ఉగ్రదాడి గురించి మాట్లాడారు. బ్రిటన్ ప్రజలు ఐకమత్యంతో ఉండాలని, తమ దేశం విలువలు ఉగ్రవాదాన్ని ఓడించగలవని నిరూపించాలన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications