‘‘రేప్ చేసి చంపేస్తారనుకున్నా .. మానసికంగా సిద్ధమయ్యా.. కానీ...’’
దోపిడీ దుండగులు తనను రేప్ చేసి చంపేస్తారని తాను అనుకున్నానని, అందుకు మానసికంగా కూడా సిద్ధమయ్యానని రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ వెల్లడించింది
పారిస్: పారిస్ దోపిడీ ఘటన తరువాత జీవితం పట్ల తన దృక్కోణం మారిందని రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ వెల్లడించింది. దోపిడీ దొంగలు తనను రేప్ చేసి చంపేస్తారని తాను భావించానని చెప్పింది.
గత ఏడాది అక్టోబర్ లో పారిస్ హోటల్ లో కర్దాషియన్ ను తుపాకీతో బెదిరించి ఆమె నగలను దుండగులు ఎత్తుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన సందర్భంగా తనకు ఎదురైన అనుభవాన్ని కిమ్ తన సోదరీమణులతో పంచుకుంది.

''అదో భయానక అనుభవం. ఆ క్షణంలో దోపిడీ దొంగలు తుపాకీతో నా తలలోకి బుల్లెట్లు దించుతారని అనుకున్నా. కానీ అలా జరగలేదు. నేను అరవకుండా నా నోటికి ప్లాస్టర్ వేయడంతో నన్ను రేప్ చేసి చంపేస్తారనుకున్నా. అందుకు మానసికంగా సిద్ధమయ్యా..'' అని కిమ్ కర్దాషియన్ వెల్లడించింది.
అయితే ఆ దోపిడీ దుండగులు ఆమెకు భౌతికంగా ఎలాంటి హానీ తలపెట్టలేదు. ఆమెను బాత్రూంలో బంధించి, ఆమె ఆభరణాలను మాత్రమే ఎత్తుకుపోయారు. ఈ కేసులో జనవరిలో 16 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు నేరం అంగీకరించాడు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications