‘‘రేప్ చేసి చంపేస్తారనుకున్నా .. మానసికంగా సిద్ధమయ్యా.. కానీ...’’
దోపిడీ దుండగులు తనను రేప్ చేసి చంపేస్తారని తాను అనుకున్నానని, అందుకు మానసికంగా కూడా సిద్ధమయ్యానని రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ వెల్లడించింది
పారిస్: పారిస్ దోపిడీ ఘటన తరువాత జీవితం పట్ల తన దృక్కోణం మారిందని రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ వెల్లడించింది. దోపిడీ దొంగలు తనను రేప్ చేసి చంపేస్తారని తాను భావించానని చెప్పింది.
గత ఏడాది అక్టోబర్ లో పారిస్ హోటల్ లో కర్దాషియన్ ను తుపాకీతో బెదిరించి ఆమె నగలను దుండగులు ఎత్తుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన సందర్భంగా తనకు ఎదురైన అనుభవాన్ని కిమ్ తన సోదరీమణులతో పంచుకుంది.

''అదో భయానక అనుభవం. ఆ క్షణంలో దోపిడీ దొంగలు తుపాకీతో నా తలలోకి బుల్లెట్లు దించుతారని అనుకున్నా. కానీ అలా జరగలేదు. నేను అరవకుండా నా నోటికి ప్లాస్టర్ వేయడంతో నన్ను రేప్ చేసి చంపేస్తారనుకున్నా. అందుకు మానసికంగా సిద్ధమయ్యా..'' అని కిమ్ కర్దాషియన్ వెల్లడించింది.
అయితే ఆ దోపిడీ దుండగులు ఆమెకు భౌతికంగా ఎలాంటి హానీ తలపెట్టలేదు. ఆమెను బాత్రూంలో బంధించి, ఆమె ఆభరణాలను మాత్రమే ఎత్తుకుపోయారు. ఈ కేసులో జనవరిలో 16 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు నేరం అంగీకరించాడు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications